ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేశారు. సి సి కెమెరాల పర్వక్షణలో లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి పోస్టల్ బ్యాలెట్ లు అధిక సంఖ్యలో 4 లక్షల 61 వేలు పోలయ్యాయి.
326views
You Might Also Like
ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించిన VHP కేంద్రీయ ప్రబంధ సమితి బైఠక్
35
విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్పూర్లోని తేరాపంథ్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి...
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
35
ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ,...
విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు
42
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ...
ధర్మవరంలో జగన్నాథ రథయాత్ర
39
ధర్మవరం ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ...
పౌరసత్వానికి భూమి పత్రాలు ఆధారం కాదని కలకత్తా హైకోర్టు తీర్పు
43
పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కేవలం భూమి లేదా ఆస్తి పత్రాలు మాత్రమే సరిపోవని కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధమైన చొరబాటు ఆరోపణల ఉన్నప్పుడు ఇలాంటి పత్రాలకు...
సంస్కృత భాషలోని వైజ్ఞానిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
48
తిరుపతి: భారతీయ సంస్కృతి, జ్ఞాన సంపదకు మూలమైన సంస్కృత భాషను అభ్యసించి, అందులో నిక్షిప్తమైన వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్...





