News

2న సుందరకాండ అఖండ పారాయణం

83views

హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 2వ తేదీన తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరగనుంది. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,872 శ్లోకాలను పండితులు పారాయణం చేయనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రామకార్యం కోసం హనుమంతుడి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించనున్నారు.