లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ సార్వభౌమాధికార దేశమని, దాని వద్దా అణుబాంబు ఉందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి మన దేశం గౌరవం ఇవ్వాలని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆ దేశంలో ఓ పిచ్చివాడు అధికారంలోకి వచ్చి..అణుబాంబును ప్రయోగిస్తే అది మంచిది కాదని..ఆ ప్రభావం మనదేశంపైనా పడుతుంది అని హెచ్చరించారు. మన ప్రభుత్వం పొరుగు దేశంతో మాట్లాడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయన్నారు. ఈ మేరకు మణిశంకర్ అయ్యర్ పేర్కొంటున్నట్లున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
258views
You Might Also Like
ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన సంపద ప్రకృతి. నదులు, జలపాతాలు, కొండలు, కోనలు, పచ్చని అడవులు, పశుపక్ష్యాదులతో అలరారే ప్రకృతి మనకు లభించడం నిజంగా అదృష్టమే. మనిషి...
పురాణాల్లో మాతృమూర్తులు : మాతృత్వానికి త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన దేవకీదేవి
ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి దేవకీదేవి. భగవంతుడిని కన్న తల్లిగా దేవకీదేవికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే...
‘మన్ కీ బాత్’లో కడప రైతు.. వరదారెడ్డికి ప్రధాని మోదీ కితాబు
3
కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన...
మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అర్ధరాత్రి చర్యల వెనుక కారణాలు చెప్పాలన్న రాజాసింగ్
6
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న...
ఇస్లాం ‘శ్రేష్ఠ ధర్మం’ అంటూ కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
5
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయారెడ్డి చేసిన ఇస్లాం మతంపై వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొప్పల్ జిల్లా కుక్నూర్ ప్రాంతంలో నిర్వహించిన...
భారత్లో సమస్యల నిర్మూలనకు ఇస్లామిక్ చట్టం అమలు చేయాలి : మౌలానా సాజిద్ రషీదీ
6
న్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాలు, నేరాలు, అవినీతిని అరికట్టాలంటే ఇస్లామిక్ చట్టం అమలు చేయాల్సిందేనంటూ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ చేసిన వ్యాఖ్యలు...





