లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ సార్వభౌమాధికార దేశమని, దాని వద్దా అణుబాంబు ఉందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి మన దేశం గౌరవం ఇవ్వాలని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆ దేశంలో ఓ పిచ్చివాడు అధికారంలోకి వచ్చి..అణుబాంబును ప్రయోగిస్తే అది మంచిది కాదని..ఆ ప్రభావం మనదేశంపైనా పడుతుంది అని హెచ్చరించారు. మన ప్రభుత్వం పొరుగు దేశంతో మాట్లాడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయన్నారు. ఈ మేరకు మణిశంకర్ అయ్యర్ పేర్కొంటున్నట్లున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
223views
You Might Also Like
అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల బైఠక్ కు ఏర్పాట్లు
4
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల బైఠక్ కర్నాటకలోని బెళగావిలో జరగనున్నాయి. జులై 10,11,12 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బైఠక్...
లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు!
44
జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని కుల్గాం నివాసి జాకీర్ గనిగా గుర్తించారు....
“మా చేతుల్లో తుపాకులు పెట్టింది పాక్ సైన్యమే” – JAAC నేత అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
36
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్...
తాజ్ మహల్ వివాదానికి కొత్త మలుపు
38
ఆగ్రాలోని తాజ్ మహల్ గతంలో 'తేజో మహాలయ్' అనే శివాలయం అని పేర్కొంటూ దాఖలైన న్యాయపోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించిన రిట్...
కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని బద్రీనాథ్ ఆలయంలోకి..
45
కొన్ని హిందూ దేవాలయాల్లో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘించిన...
సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలి
41
గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు.. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి...





