
265views
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. డీఆర్డీవోలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ క్లస్టర్ అధిపతి బినయ్ దాస్, ఇతర శాస్త్రవేత్తలు, ఐఐటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఎలక్ట్రానిక్స్ యుద్ధవ్యవస్థలు, ఏఐ ఆధారిత నిఘా సాధనాలు, పవర్ సిస్టమ్స్, రాడార్ వ్యవస్థలను భువనేశ్వర్ ఐఐటీ నిపుణులు రూపొందిస్తారు.





