News

నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ గా దినేష్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ

319views

నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ గా దినేష్‌ కుమార్‌ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నావికాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్‌గా, వెస్ట్రన్ నేవల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. ఆర్‌ హరి కుమార్‌ రిటైర్‌ అయిన తర్వాత 26వ నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ దినేష్‌ కుమార్‌ త్రిపాఠి దినేష్ కె త్రిపాఠి నియమితులయ్యారు. ఆయన నియామకంపై ప్రభుత్వం ఏప్రిల్ 19న అధికారిక ప్రకటన చేసింది.

జూలై 1985లో త్రిపాఠి ఒక కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్. కొర్వెట్ INS కిర్చ్, ఫ్రిగేట్ INS త్రిశూల్ వంటి యుద్ధనౌకలకు నాయకత్వం వహించారాయన. ఆయన కెరీర్‌లో కీలకమైన కార్యాచరణ, సిబ్బంది నియామకాలను నిర్వహించాడు.