ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. భూ వినియోగతీరులో మార్పులు, జీవవైవిధ్యంపై వాటి ప్రభావాలను విశ్లేషించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం.. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం 2-11 శాతం మేర తగ్గి ఉండొచ్చని పేర్కొంది. తమ పరిశోధన కోసం అన్ని ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకున్నామని వారు తెలిపారు. ఇతర విధానాలపై వచ్చిన విమర్శలనూ విశ్లేషించామని చెప్పారు. భూ వినియోగ తీరు, వాతావరణ మార్పుల ఉమ్మడి ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అని ప్రాంతాల్లోనూ జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఆ ప్రాంతంలోని కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదానితో సంబంధం లేకుండా ఇది సాగుతుందని తెలిపారు. ‘‘భూ వినియోగ తీరులో మార్పుల వల్లే జీవ వైవిధ్యంలో క్షీణతకు ప్రధాన కారణమని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే ఈ శతాబ్దం మధ్య నాటికి వాతావరణ మార్పులే ఇందుకు ముఖ్య కారణమవుతాయని మా పరిశీలనలో వెల్లడైంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేవిడ్ లెక్లెరె చెప్పారు. రానున్న దశాబ్దాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విధానాల్లో అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
Cover / Wallpaper Design
70
You Might Also Like
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
36
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. 2017లో స్వామినాథన్ డబ్ల్యూహెచ్వోలో...
మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా… ఏం పర్లేదు… ఈ కార్డులున్నా ఓటేయవచ్చు..!!
31
ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కే కాదు బాధ్యత కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రజల వజ్రాయుధం. దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత...
ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం
54
ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా భారత్కి రోజురోజుకీ ప్రాధాన్యత పెరిగిపోతోంది. భారత్లో వున్న భిన్నత్వం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద దేశంలో...
పాక్ ఆక్రమిత కశ్మీర్లో విధ్వంసం.. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు..
39
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారుల చేతుల్లో చిక్కుకున్న పోలీసులు ప్రాణాలు అరచేతిలో...
భక్తుని ప్రశ్నించిన హనుమంతుడు
80
మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్లబండిలో ఇంటికి బయల్దేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా, బండి...
దీపారాధన ఎందుకంటే..
71
దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు. శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే...