
388views
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య లో రామాలయ ప్రారంభోత్సం వేళ.. స్థానికంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం సకల హంగులతో ముస్తాబైంది. ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరుపెట్టిన దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్టులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో కేవలం 20 నెలల్లోనే పూర్తి చేసినట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) ఛైర్మన్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. అయోధ్యలో ఏడాది పొడవునా తీర్థయాత్ర పర్యాటకాన్ని, వ్యాపారాలను ఈ విమానాశ్రయం సులభతరం చేస్తుందన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరిస్తామని ఓ వార్తాసంస్థకు తెలిపారు.







