
329views
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతున్నది. చైనా వేదికగా జరుగుతున్న పోటీల్లో సోమవారం మన అథ్లెట్లు ఏడు పతకాలు సొంతం చేసుకున్నారు. మంగళవారం మరో పతాకం గెల్చుకోవడంతో మొత్తంగా 61 మెడల్స్ ఖాతాలో వేసుకున్న భారత్ వంద పతకాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది పతకాల పట్టికలో 61 మెడల్స్తో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నది.
ఇందులో 13 స్వర్ణాలు, 24 కాంస్యం, 24 రజతాలు ఉన్నాయి. తొమ్మిదో రోజైన శుక్రవారం 3 రజతాలు 4 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు గెలుపొందారు. ఆసియా చాంపియన్షిప్లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న అన్సీ సోజన్ ఆసియా క్రీడల్లో అదరగొట్టింది. ఈ 22 ఏళ్ల కేరళ సంచలనం లాంగ్జంప్లో భారత్కు రెండో రజతం అందించింది. సోమవారం జరిగిన ఫైనల్లో ఐదో ప్రయత్నంలో సోజన్ శక్తినంతా కూడదీసుకొని 6.63 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని ముద్దాడింది.





