
ప్రధాని నరేంద్ర మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తానని బెదిరిస్తూ ఓ మీడియా సంస్థకు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్ 5న లక్నోలోని సెక్టార్ 20 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్యాప్తు చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు టెక్నికల్ టీంలను రంగంలోకి దింపి నిందితుడిని గుర్తించారు. బెదిరింపు ఈమెయిల్స్ పంపింది.. పాఠశాలలో చదువుతున్న బాలుడిగా గుర్తించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు లక్నోలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బీహార్కు చెందిన 16 ఏళ్ల బాలుడిని శుక్రవారం ఉదయం రాజధానిలోని చిన్హాట్ ప్రాంతం అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) రజనీష్ వర్మ తెలిపారు. ఏప్రిల్ 5న సెక్టార్ 20 పోలీస్స్టేషన్లో కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసులు నిందితులను పట్టుకునేందుకు సాంకేతిక బృందాలు కూడా పనిచేశాయి” అని వర్మ చెప్పారు.
“దర్యాప్తు నివేదిక ప్రకారం ఈమెయిల్ పంపిన వ్యక్తిని లక్నోలోని చిన్హట్ ప్రాంతంలో గుర్తించడం జరిగింది. పంపిన వ్యక్తి పాఠశాల విద్యార్థి అని తేలింది, అతను ఇప్పుడే 11వ తరగతి పూర్తి చేసి, ఈ సెషన్లో 12వ తరగతి ప్రారంభించబోతున్నాడు’’ పోలీసు అధికారి తెలిపారు.





