News

గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ.. తెలంగాణ హిందువులను ముస్లింలుగా మత మార్పిడి!

247views

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తిలో హిందువులను ముస్లింలుగా మతం మార్చి.. ఉగ్రవాద శిక్షణకు పంపిస్తున్నారు. విక్కీ అనే ముస్లిం వ్యక్తి హిందువులను ఏమార్చి ముస్లింలుగా మతం మారుస్తున్నాడు. తమ దగ్గర ఉపాధి కోసం పనిచేసే యువకులకు ఇస్లాం గురించి నూరి పోస్తూ.. ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వీరిని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు తదితర నగరాలలో ఉగ్రవాద శిక్షణకు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. హిందూ యువకులు ముస్లింలుగా మారితే.. ముస్లిం అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేస్తామని మాయమాటలు చెప్పి తమ బుట్టలో వేసుకుంటున్నట్లు సమాచారం. కల్వకుర్తికి చెందిన శివ రామాచారి అనే యువకుడిని మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే విషయమై శివ రామాచారి తండ్రి భాస్కరాచారి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. విశ్వహిందూ పరిషత్ వారు కల్వకుర్తి పోలీస్ అధికారులను సంప్రదించగా.. పూర్తి వివరాలు సేకరిస్తామని వివరించినట్లు తెలుస్తోంది. అవసరమనుకుంటే విక్కీ కాల్ డేటాను పరిశీలిస్తామని పోలీసులు వారికి చెప్పారు.

 

సోర్సు – రిథమ్‌ యాప్‌