
379views
శ్రీహరికోట: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది! వచ్చే ఏడాది జూన్లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్నాథ్ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్ను దానిద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్టు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన చెప్పారు.





