News

ఏడు ఖండాల్లో పర్వతారోహణ

463views

* మలావత్ పూర్ణ సాధించిన ఘనత

వరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్‌కు చెందిన మలావత్‌ పూర్ణ మరో ఘనత సాధించారు.

అమెరికా దేశం అలస్కాలోని 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరోహించారు. తాజా ఘనత ద్వారా ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు. పూర్ణ జూన్‌ 5న డెనాలీ శిఖరంపైకి చేరుకొన్నారు. ఉత్తరాదికి చెందిన తండ్రి కూతుళ్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్‌ బజాజ్‌, దియా బజాజ్‌, విశాఖకు చెందిన అన్మీశ్‌ వర్మతో కలిసి మే 23న ఆమె యాత్ర ప్రారంభించారు. ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ ఆర్థిక సాయం, ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ సహకారంతో యాత్ర పూర్తి చేశారు. తాజా రికార్డుపై పూర్ణ కోచ్‌ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.