ArticlesNews

నిజంగా అందరూ ఒక్కటేనా?

549views

నా చిన్నతనం నుంచి చూస్తున్నా…. “మా దేవుడొక్కడే దేవుడు” మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి.” అని బోధించేవారికి బోధించాల్సిన సూక్తులు పిల్లిలో, బల్లిలో, చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో సృష్టిలోని అణువణువులో భగవంతుడున్నాడని విశ్వసించే మాకు బోధిస్తారెంటీ? దురదృష్టవశాత్తూ ఇలాంటి బోధనలకు లొంగి గోమాతను పూజించే అమాయక హిందూ యువతులు గోమాంసం భక్షించే సంకుచిత మతావలంబకులను వివాహం చేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. “నీవే సర్వాంతర్యామివి. నీలో ఉన్న ఆత్మే సృష్టి అంతా ఆవరించి ఉంది. అన్నీ నీవే. అంతటా నీవే. పాప చింతనను వీడి పుణ్య కార్యాలను ఆచరించి యోగ సాధన చేస్తే ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు.” అనే విశాల తత్వం కలిగిన మతంలోంచి…. “మీరు పాపులు. నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని పాపాల నుంచి రక్షిస్తాను. నేను పాపులను రక్షించటానికే అవతరించాను. నన్ను కాక మీరు వేరెవరినైనా విశ్వసిస్తే నేను మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను.” వగైరాలను బోధించే మతంలోకి వెళుతున్నారు అమాయకంగా.

మన పిచ్చి కాకపోతే… అసలు ఇలా పరస్పర భిన్నమైన తత్వాలు కలిగిన మతాలు, వాటి దేవీదేవతలు ఒకటెలా అవుతాయి? గోవును తల్లిగా భావించి పూజించేవారు, గోహంతకులు ఒక్టేక ఎలా అవుతారు? “నేను దేవుడ్ని, నువ్వు పాపివి’ అని చెప్పేవాడు, “నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను. నీలోనూ ఉన్నాను. తరచి చూసుకుంటే నువ్వే నేను. నేనే నువ్వు. అంతటా నువ్వే ఉన్నావు. నీవు అమృతపుత్రుడవు. అనంత శక్తి సంపన్నుడవు.” అని చెప్పేవాడు ఇద్దరూ ఒకటేనా? మనం ట్రాప్లో పడిపోతున్నాం. కఠినంగా అనిపించినా ఇదే నిజం. దేవుళ్ళందరూ ఒక్కటే అంటూ వారు చెప్పేదే నిజమైతే వారిని మత మార్పిడులు ఆపేయమనండి. దేవాలయ విధ్వంసాలను, దాడులను, హింసని, హత్యలనూ ఆపేయమనండి. అందరిలోనూ, అన్నిటిలోనూ దైవాన్ని దర్శించే సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించమనండి. మరీ ముఖ్యంగా మత ఛాందసులకు, పరమత ద్వేషులకు, విధ్వంసకులకు, హంతకులకు, ఉగ్రవాదులకు ఈ సూక్తులు బోధించమని ఈ సిద్ధాంతకర్తలకి చెప్పండి. బంగ్లాదేశ్ లో పిలిచి భోజనం పెడితే, ప్లాన్ చేసి దేవాలయాన్ని కూల్చేశారు చూడండి…. వారికి చెప్పమనండి. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయిలను బహిరంగంగా, సామూహికంగా మానభంగం చేసి చంపేశారు చూడండి… ఆ మతోన్మాదులకు చెప్పమనండి. చీమలకు చక్కెర, పాములకు పాలు పోసే కారుణ్యమూర్తులకు, సాత్వికులకూ ఈ సూక్తి ముక్తావళి అవసరం లేదని, మమ్మల్ని ఇంకా దద్దమ్మల్ని చెయ్యొద్దనీ ఆ పెద్దమ్మలకి చెప్పండి. శుభం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.