News

త్వరలోనే వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

497views

తిరుప‌తి: కొవిడ్‌ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను టీటీడీ త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు టీటీడీ వెబ్‌సైట్‌లో బార్‌కోడ్‌ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ కేటగిరీలో రోజుకు వెయ్యి చొప్పున టోకెన్లు ఇవ్వనున్నారు.

ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల స్లాట్‌లో రోజూ వేయి మందిని దర్శనానికి అనుమతిస్తారు. టోకెన్లను ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేసేదీ టీటీడీ త్వరలో వెల్లడించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి