
-
కేరళ పోలీస్ శాఖ నుంచి కానిస్టేబుల్ అనాస్ సస్పెన్షన్
తిరువనంతపురం: అధికారిక రికార్డులు, పోలీసు డేటాబేస్ నుండి పీ.ఎఫ్.ఐ, ఎస్.డీ.పీ.ఐ ఉగ్రవాదులకు ఆర్.ఎస్.ఎస్, బీ.జే.పీ నాయకుల సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసినందుకు అధికారులు కేరళ కానిస్టేబుల్ పీకే అనాస్ను సర్వీస్ నుండి సస్పెండ్ చేశారు.
ఇడుక్కి జిల్లా తొడుపుజాలో మధుసూధన్ అనే బస్సు కండక్టర్పై పీఎఫ్ఐ ఉగ్రవాదులు దాడి చేసిన కేసులో నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి ఆర్ఎస్ఎస్ నేతల వ్యక్తిగత సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు డేటాబేస్ నుంచి ఈ సున్నితమైన రికార్డులు లీక్ అయ్యాయి.
పోలీసు బలగాలలోని పీఎఫ్ఐ ద్రోహులు కనీసం 135 ఆర్.ఎస్.ఎస్, బీ.జే.పీ కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసి పిఎఫ్ఐ-ఎస్డిపిఐ ఉగ్రవాదులకు అందజేశారని మలయాళ దినపత్రిక జన్మభూమి నివేదించింది. ఆ తర్వాత అది కేరళ పోలీసులలో పీఎఫ్ఐ ఏజెంట్గా పనిచేస్తున్న పీకే అనాస్ చేతివాటం అని తేలింది. అంతర్గత విచారణ తరువాత, అనాస్ ఇడుక్కి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయబడ్డారు. తరువాత అతను వివరణాత్మక విచారణ తర్వాత ఫోర్స్ నుండి సస్పెండ్కు గురయ్యాడు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విచారణలో, అనాస్ అధికారిక ఐడిని ఉపయోగించి రాష్ట్ర పోలీసు డేటాబేస్ నుండి ఈ సమాచారాన్ని యాక్సెస్ చేసి, పిఎఫ్ఐ-ఎస్డిపిఐ వారితో పంచుకున్నట్టు తేలింది. దర్యాప్తు అధికారి తన పరిశోధనల ఆధారంగా సీపీఓపై శాఖ స్థాయి చర్యలను జిల్లా పోలీసు చీఫ్కు సిఫార్సు చేశారు. విచారణ నివేదిక, సిఫార్సు ఆధారంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆర్.కరుపుస్వామి అనాస్ను సస్పెండ్ చేశారు.
కేరళ పోలీసులలో ఇస్లామిక్ రాడికల్స్ ఉనికి…
కేరళ పోలీసులలో ఇస్లామిక్ రాడికల్స్ ఉనికి మొదటిసారిగా 2018లో తెరపైకి వచ్చింది, పచ్చవెలిచం (గ్రీన్ లైట్) అనే వాట్స్ యాప్ గ్రూప్ ముస్లిం పోలీసు అధికారుల మధ్య రహస్యంగా పనిచేస్తుందని ఇంటెలిజెంట్ వర్గాలు నివేదించినప్పుడు… లవ్ జిహాద్, ఉగ్రవాదం, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఇస్లామిక్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంలో ఈ బృందం నిమగ్నమై ఉంది.
ఇటీవల ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్య ఘటనల తర్వాత కేరళ పోలీసులు రాష్ట్రంలోని పీఎఫ్ఐ, ఎస్డీపీఐలకు మద్దతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ ఆరోపించారు. పిఎఫ్ఐ వంటి ఇస్లామిక్ సంస్థల కోసం పనిచేస్తున్న ఒక వర్గం పోలీసు శాఖలో ఉందని ఆయన ఆరోపించారు.
Source: Organiser





