
391views
ముంబయి: అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువరించింది మహారాష్ట్ర, ముంబయిలోని పోక్సో ప్రత్యేక కోర్టు. 13ఏళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ చర్చి ఫాదర్కు జీవిత ఖైదు విధించింది. 2015లో ఓ చర్చి ఫాదర్ జాన్సన్ లారెన్స్ 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2015, డిసెంబర్లో ఫాదర్ను అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. ఈ కేసును బుధవారం ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తి సీమా జాధవ్.. చిన్నారుల లైగింక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో)లోని సెక్షన్ 6, 12 ప్రకారం దోషిగా తేల్చారు. జాన్సన్ లారెన్స్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.