News

బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జల్లిన దుండగులు

417views
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పెల్లుబికిన నిరసన

బెంగ‌ళూరు: బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జ‌ల్లి దుండగులు విగ్రహాన్ని అపవిత్రం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో బెలగావిలో నిరసనలు పెల్లుబికాయి. హిందూ, మరాఠీ సంఘాలు శుక్రవారం అర్ధరాత్రి స్థానిక సంభాజీ చౌక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాయి. నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాందేవ్ గల్లీలో ఓ ఆటో డ్రైవర్​ను నిరసనకారులు చితకబాదారు.

హుతాత్మ సర్కిల్​లో ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇతర ప్రభుత్వ వాహనాలపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. పలు వాహనాల బోర్డులను తొలగించారు. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విగ్ర‌హ ప‌రిస‌రాల్లో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి