News

90 సెకండ్లలో భూసార పరీక్ష.‌‌.. ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తల ఘనత

724views

భూసార పరీక్షల ఇబ్బందులను దూరం చేసే అద్భుత సాధనాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. 90 సెకన్లలోనే ఫలితాన్ని అందించడం దీని ప్రత్యేకత. ఈ పరీక్ష కోసం 5 గ్రాముల మట్టి నమూనాలు సరిపోతాయి. కాన్పుర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.

‘నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కొపీ’ సాంకేతికతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది నేల తీరుతెన్నులను అప్పటికప్పుడు విశ్లేషించి, ఆ సమాచారాన్ని స్మార్ట్ ‌ఫోన్ ‌పై అందిస్తుంది. ఇందుకోసం ‘భూ పరీక్షక్‌’ పేరుతో ఒక మొబైల్‌ యాప్ ‌ను రూపొందించారు. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పొందొచ్చు.

ఈ మొబైల్‌ యాప్ ‌ను యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా చాలా సులువుగా వాడగలిగేలా తీర్చిదిద్దారు. రైతులకు స్థానిక భాషల్లోనూ ఇది సమాచారం ఇస్తుంది. 8వ తరగతి చదివిన వ్యక్తి కూడా దీన్ని సులభంగా ఉపయోగించగలుగుతాడు. ఒక్క సాధనంతో దాదాపు లక్ష నమూనాలను పరీక్షించొచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.