202
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసుతో పాటు మరో ఐదు డ్రగ్స్ కేసులపై శుక్రవారం ఏర్పాటైన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెంటనే పని ప్రారంభించింది.
శనివారమే ఢిల్లీ నుంచి ముంబయి చేరుకుని, ఈ కేసులకు సంబంధించిన పత్రాలన్నింటినీ ముంబయిలోని ఎన్సీబీ జోనల్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుంది. ఆయా కేసుల దర్యాప్తు ఎంతవరకు జరిగిందో తొలుత పరిశీలిస్తామని, ఆ తర్వాతే పునర్విచారణపై నిర్ణయం తీసుకుంటామని సిట్ కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఆరు కేసుల దర్యాప్తు నుంచి తొలగింపునకు గురైన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే మాత్రం దర్యాప్తులో తాను లేనప్పటికీ జోనల్ డైరెక్టర్ హోదాలో పర్యవేక్షక అధికారిగా కొనసాగుతానని చెప్పారు.