News

విజయ్ మాల్యాకు మరో షాక్.. భారత్ కు అప్పగించాలనే తీర్పు..!

428views

బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఇప్పుడు టైమ్ ఏ మాత్రంబాగాలేదు. కొద్ది రోజుల క్రితమే డబ్బులు కట్టేస్తా అని చెప్పిన విజయ్ మాల్యాకు యూకేలోని వెస్ట్ మినిస్టర్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఆయన్ని భారత్‌కు అప్పగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. రూ.9వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేయడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి నేరారోపణలున్న మాల్యాపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు 2016లో ఆయన లండన్ పారిపోయారు. మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ కోరింది. కొన్ని నెలలుగా సాగుతూ వచ్చిన విచారణలో భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. మాల్యాను భారత్ అప్పగించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకొనేందుకు మాల్యాకు కోర్టు అవకాశం ఇచ్చింది.

Source: Bharath Today.