కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసును అందించే ప్రణాళికలను కనీసం సెప్టెంబరు ముగిసే వరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పిలుపునిచ్చారు. ముందుగా అన్ని దేశాల్లో కనీసం 10% ప్రజలకు రెండు డోసులు అందేలా చూడాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా తమ పౌరులకు బూస్టర్ డోసు అందించే ప్రక్రియను ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ ముప్పును అధిగమించేందుకుగాను అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు కూడా ‘బూస్టర్’ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో బుధవారం విలేకర్ల సమావేశంలో అధనోమ్ మాట్లాడారు. కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ తొలి డోసు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు మూడో డోసు ఆలోచనలను మానుకోవాలన్నారు.
437
You Might Also Like
వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన
49
వరల్డ్ ఆర్చరీలో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించి అరుదైన ఘనత సాధించారు. తన అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్ 1...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
40
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు హతం...
కాశ్మీర్లోని ఆలయం.. 524 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం
48
అఖండ భారత దేశంలో అనేక అందమైన పురాతన దేవాలయాలున్నాయి. వాటిల్లో కొన్నిటిని విదేశీయులు దండయాత్ర చేసి నాశనం చేయడమే కాదు దొరికినంత సంపదను దోచుకున్నారు. అలాంటి పురాతన...
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం ; చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెల్లడి
40
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధుల తోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. మరోవైపు...
తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న మద్రాస్ హైకోర్ట్
139
తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 1995 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టానికి చేసిన తమిళనాడు ప్రభుత్వం సవరణను మద్రాస్ హైకోర్ట్ రాజ్యాంగ విరుద్ధమని...
సందేశ్ఖాలీలో భారీగా మారణాయుధాలు లభ్యం
43
కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జరిపిన సోదాల్లో మారణాయుధాలు, నాటు బాంబులు, ఇతర పేలుడు పదార్ధాలు భారీ మొత్తంలో లభ్యమయ్యాయి. జనవరిలో ఈడీ అధికారులపై...