News

News

బద్రీనాథ్ దర్శనం లేకుండానే.. 650 మందికి పైగా భక్తులు వెనక్కి

పేర్లు నమోదు చేసుకోకుండా చార్ థామ్ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ వెళుతుండగా.. గౌచార్ చెకోపోస్ట్ నుంచే వారిని వెనక్కు పంపించినట్లు చమోలీ...
ArticlesNews

రణదీప్ హుడాకు స్వతంత్ర వీర్ సావర్కర్ అవార్డు

స్వాతంత్ర్య వీర్ సావర్కర్ 141వ జయంతి సందర్భంగా ఈ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి సేవలను గౌరవిస్తూ ముంబైలో ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ నటుడు రణదీప్ హుడా ఇటీవలి చిత్రంలో సావర్కర్ పాత్రను అద్భుతంగా పోషించినందుకు స్వాతంత్ర్య వీర్ సావర్కర్...
News

ఇండియా Vs చైనా సైన్యం.. ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో విజయం మనదే

భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో భారత జవాన్లు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు...
News

వైద్యుడికి నక్సలైట్ల బెదిరింపులు.. పద్మ శ్రీ వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటన

వైద్యం ద్వారా ప్రజా సేవ చేస్తున్న వైద్యుడి సేవలను కూడా నగ్జలైట్లు తట్టుకోలేకపోతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా… సంప్రదాయ వైద్య అభ్యాసకుడు హేమచంద్‌ మాన్ ఝీకి నక్సలైట్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. నక్సలైట్ల నుంచి బెదిరింపులు రావడంతో తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. అంతేకాకుండా నక్సలైట్ల బెదిరింపు కారణంగా వైద్య వృత్తిని కూడా వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. మాన్ ఝీ చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారు. నక్సలైట్ల ప్రాబల్యం అత్యధికంగా వుండే బస్తర్‌, నారాయణపూర్‌ జిల్లాల్లో ఆయన పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హేమచంద్‌ మాన్ ఝీకి పద్మశ్రీ అవార్డును బహూకరించారు. ఆదివారం అర్ధరాత్రి నక్సలైట్ల చమేలీ, గౌర్దండ్‌ గ్రామాల్లో...
News

సాంకేతిక సమస్య.. అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్‌ రాకెట్‌ అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో...
News

అమెరికాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామి వారి గోవింద నామం మార్మోగింది. నిత్యం ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం, తోమాల సేవ, తిరు ఆరాధన గజవాహన సేవ వంటి క్రతువులను నిర్వహించారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ఇవాళ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు....
News

ఆ అమెరికా బడి ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తోంది

ఫ్లోరిడాలో రివైవర్ అకాడమీ నడుపుతున్న ముస్లిం పాఠశాల 'భావి ఉగ్రవాదుల'కు తర్ఫీదు ఇస్తోందని అక్కడి ప్రజాప్రతినిధి రాండీ ఫైన్ ఫిర్యాదు చేశారు. ఫ్లోరిడా విద్యాశాఖ కమిషనర్ మ్యానీ దియాజ్కు ఈ మేరకు ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదు అందచేశారు. రివైవర్ అకాడమీని...
ArticlesNews

పేరుకే టీటీడీ అనుబంధ ఆలయాలు

అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం శ్రీపట్టాభి రామాలయం, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసూరివారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలను రెండు దశాబ్దాల క్రితమే టీటీడీ స్వాధీనం చేసుకుని ఈ ఆలయాల ఆలనాపాలన నిర్వహిస్తోంది....
News

మణిపూర్‌లో డ్యామ్‌ను పేల్చివేసే కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో భారీ పేలుడు కుట్రను భారత సైన్యం ముందుగా పసిగట్టి భగ్నం చేసింది. నాంగ్‌డామ్ నుంచి ఈథామ్ తాంగ్‌ఖుల్ గ్రామాలను కలిపే రహదారిపై మూడు ఐఈడీ బాంబులను అమర్చిన సంగతిని సైన్యం కనుగొంది. మాఫౌ డ్యామ్ చేరువలో...
News

ఇష్టకామేశ్వరి అమ్మవారు చెంతకు సరైన మార్గం

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల గ్రామంలోని వారందరూ చెంచు గిరిజనులే.ఈ గ్రామంలోని ఇష్టకామేశ్వరీ దేవాలయం ఆధ్యాత్మికంగా విశిష్ట గుర్తింపు పొందింది. భక్తుల కొంగు బంగారం అమ్మవారు ఆధ్యాత్మికంగా ఇష్టకామేశ్వరి అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చె కొంగుబంగారంలా భావించి, జీవితంలో ఒక సారైనా దర్శించుకోవాలని, తమ కష్టాలు, బాధలు తొలగించు కోవాలని భక్తులు భావిస్తారు. శ్రీశైలం వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వస్తారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జీపులలో మాత్ర మే ఒక్కొక్కరికీ, రూ.1,000లు చెల్లించి ప్రయాణించాల్సి ఉంది. అది కూడా ముందు రోజే శిఖరం వద్ద తెల్లవారు జామునే టిక్కెట్లు ఇస్తారు. అయినా రోజుకూ 150 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. గుర్తింపు పొందిన ప్రాంతం అయినప్పటికీ, గ్రామానికి సరైన మార్గం కూడా లేక పోవడంతో ప్రజల సమస్యలు...
1 1,198 1,199 1,200 1,201 1,202 2,480
Page 1200 of 2480