News

News

14 వేలతో దక్షిణ భారత పుణ్యక్షేత్రాల దర్శనం.. వివరాలు ఇవిగో!

దేశంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలని భావించే భక్తుల కోసం రైల్వే శాఖ దక్షిణ భారత యాత్ర స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.14 వేలతో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చే అవకాశాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోంది....
News

పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో శివలింగాలకు రసాయనిక మరమ్మతులు

ప్రముఖ శైవక్షేత్రాలు, పంచారామాలుగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో శివలింగాలకు రసాయనిక రక్షణ కల్పించనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటిండెంట్ వి.కోటయ్య నేడు ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలను సందర్శించారు. ఈ ఆలయాల గర్భగుడిలోని శివలింగాల భౌతికస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా...
News

భారత్ ప్రపంచానికి తీర్థ క్షేత్రం కాగలదు

భారత భూమిపై ఐకమత్యం నెలకొల్పి మనం ప్రపంచాన్ని మురిపించాలి. ఈ భారత భూమి మానవ జాతికి తీర్థక్షేత్రం కాగలదు. అన్ని మతాలు, భిన్న సంస్కృతులు ఇక్కడ కాపురం చేస్తున్నాయి. ఇది విని అన్ని దేశాలూ భారత భూమికి దగ్గరకాగలవు. ఈ చారిత్రాత్మక మహాకార్యాన్ని మనం సాధించాలి. ఈ మహా ధ్యేయం మనల్ని ఎలుగెత్తి పిలుస్తుంది. భారతీయ సంస్కృతీ ఉపసాకులందరూ శ్రద్ధతో త్యాగపూర్వకంగా దీనికై నడుం కట్టాలి. తొందరపాటు వద్దు. స్వార్ధం వద్దు. సోమరితనం వద్దు. సమాజంపై ప్రేమ, చింతన అవసరం. సమాజాన్ని ఎలా సుఖవంతంగా వుంచాలో అన్న చింతనలోనే వుండాలి.-సానే గురూజీ...
News

జమ్మూకశ్మీర్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీఐ

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆ ప్రాంతంలో మెరుగవుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. దాంతో ఆ ప్రాంతంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తులు కేటాయించే...
ArticlesNews

ఇందిర హత్య దృశ్యాన్ని కెనడాలో రిక్రియేట్ చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదులు

1984 జూన్ 6న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమృతసర్‌లోని స్వర్ణమందిరాన్ని ఆక్రమించుకున్న పంజాబీ వేర్పాటువాది భింద్రన్‌వాలేను తుదముట్టించడానికి ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరిట పోలీసు చర్య నిర్వహించింది. 40 ఏళ్ళ నాటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాలో...
News

తూర్పునావికాదళం‌ ఆధ్వర్యంలో విశాఖలో బీచ్ క్లీనింగ్

ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పునావికాదళం‌ ఆధ్వర్యంలో శనివారం విశాఖ పట్నంలోని బీచ్ క్లీనింగ్ నిర్వహించారు.అలాగే తీరప్రాంతం కోతకు గురికాకుండా రక్షించే మడ అడవుల పెంచేక్రమానికి నాందిపలుకుతూ మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో నేవల్ డిఫెన్స్ సివిలియన్ సిబ్బంది వారితో పాటు భారీ...
News

శ్రీశైలం మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ముఖ్యంగా వేసవి సెలవుల కారణంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గత 28 రోజులలో భక్తులు స్వామి, అమ్మవార్లకు, ఉప ఆలయాలకు సమర్పించుకున్న కానుకల ద్వారా...
ArticlesNews

మూడు రోజుల పాటు జరగనున్న మోదకొండమ్మ ఉత్సవాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ రోజు నుంచి 11 తేదీ వరకు శక్తిస్వరూపిణి.. మన్యం దేవత మోదకొండమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. పరవశించిపోయే ప్రకృతి మధ్య మోదకొండమ్మ దేవికి ఏటా ప్రత్యేక ఉత్సవాలు...
News

సాధువు కత్తి

ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ....
1 1,179 1,180 1,181 1,182 1,183 2,479
Page 1181 of 2479