ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ. చెంతనున్న వస్తువులు మన మనసుపై ప్రభావాన్ని చూపుతాయనే హెచ్చరిక ఇది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు ప్రతికూలతను చూపే వ్యక్తులకే కాదు, వస్తువులకూ దూరంగా ఉండాలని, సాంగత్య ప్రభావంతో మనసు మారిపోతుందని మన ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.
315views
You Might Also Like
కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
6
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. స్వదేశీ టెక్నాలజీతో తయారైన లాంగ్ రేంజ్ సర్ఫేజ్-టూ-ఎయిర్ మిస్సైల్ (LRSAM) ‘‘కుశ’’ను విజయవంతంగా పరీక్షించింది....
ద్వారకాతిరుమలలో నూతన రూపు సంతరించుకుంటున్న ఆళ్వార్ సదనం
6
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఆళ్వార్ సదనం నూతన రూపును సంతరించుకుంటోంది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ సత్రం భవనానికి దేవస్థానం...
భక్తి మార్గానికి బాటలు వేసే నామసంకీర్తనం
సనాతన ధర్మంలో భక్తి మార్గానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. భగవంతుడిని చేరుకునేందుకు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మన ఋషులు సూచించారు. వాటిలో సామాన్యుల నుంచి...
తిరుమలలో హార్న్ కొడితే చర్యలే – శబ్ద కాలుష్యంపై టీటీడీ కఠిన చర్యలు
7
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ 'ఏడు కొండల వాడ వేంకటరమణ గోవిందా గోవింద' అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం...
భారతదేశ నాగరికతా చైతన్యంలో గిరిజన సంప్రదాయాలు
భారతదేశంలో గిరిజన వర్గాలకు ప్రత్యేక మత నియమావళి ఉండాలనే డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది. గిరిజనుల ప్రత్యేక గుర్తింపు, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడేందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని...
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
9
విశాఖపట్నం: గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్...




