
ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక హిందూ యువతిని మోసం చేయడంతో పాటు, ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడి, అనంతరం మతం మారాలని ఒత్తిడి తెచ్చాడనే ఆరోపణలతో షాబాజ్ రజాక్ షేక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత యువతి మరియు షాబాజ్ రజాక్ షేక్ 2022లో మలాడ్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో పరిచయం అయ్యారు. కాలక్రమేణా వారి మధ్య స్నేహం పెరిగి, 2024 నుంచి ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, షాబాజ్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాలు కొనసాగించాడు. ఈ సమయంలో ఆమె రెండుసార్లు గర్భవతి కాగా, రెండు సందర్భాల్లోనూ గర్భస్రావం చేయాలని ఒత్తిడి తెచ్చి బలవంతం చేశాడని ఆరోపించింది.
తనను వివాహం చేసుకోవాలంటే మతం మారాలని షాబాజ్ ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు ఆరోపించింది. దీనికి ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రతరమైనట్లు తెలుస్తోంది.తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు మే 28న నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, షాబాజ్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆమెపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.





