News

చారిత్రక కోట ఆలయ పరిరక్షణకై హిందూ సమాజం పోరాటం

0views

యూపీ లక్నోలోని మలిహాబాద్ పరిధిలో గల కసమండీ కలాం గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన నాగవంశీయుడైన మహారాజా కంస పాసి చారిత్రాత్మక కోట మరియు ప్రాచీన శివాలయ ఉనికిని కాపాడుకునేందుకు హిందూ సమాజం శ్రేయస్సుతో ఉద్యమించింది. విదేశీ దురాక్రమణదారుడు సాలార్ గాజీ దాడి సమయంలో బలవంతంగా ఆక్రమణకు గురై, మక్బరా మరియు మసీదుగా మార్చబడిన ఈ పవిత్ర ప్రాంగణంలో ఇటీవల మత పెద్దల ప్రోద్బలంతో భారీగా గుమిగూడి నమాజ్ పేరిట అక్రమ ఆక్రమణలకు ప్రయత్నించడం స్థానిక వనవాసి పాసి సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

తమ పూర్వీకుల వారసత్వాన్ని, హిందూ ధర్మ ఉనికిని రక్షించుకోవాలనే సంకల్పంతో పీఠాధిపతులు, లాఖన్ ఆర్మీ మరియు పలు హిందూ సంఘాలు వివాదాస్పద ప్రాంగణంలో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణానికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో శాంతిభద్రతల రక్షణ దృష్ట్యా పోలీసులు అక్కడ ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు జరగకుండా ఆంక్షలు విధించి, భారీ బలగాలను మోహరించి హై అలర్ట్ ప్రకటించారు.హిందూ సమాజం మరియు పాసి సామాజిక వర్గం తమ చారిత్రక హక్కులను నిరూపించేందుకు చట్టపరమైన, శాస్త్రీయమైన పోరాటానికి సిద్ధమయ్యాయి. కేవలం వందల ఏళ్ల నాటి కట్టడంగా ముస్లిం వర్గం చేస్తున్న వాదనలను తిప్పికొడుతూ, ఈ పవిత్ర భూమి యొక్క పూర్వ వైభవాన్ని వెలుగులోకి తేవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపి, శతాబ్దాల నాటి అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ పాసి సమాజ ప్రతినిధులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని భారత పురాతత్వ సర్వే సంస్థ (ASI) లేదా రాష్ట్ర పురాతత్వ శాఖ అధీనంలోకి తీసుకుని నిష్పక్షపాతంగా కార్బన్ డేటింగ్ మరియు శాస్త్రీయ సర్వే జరిపించాలని, తద్వారా హిందూ ఆలయ ఆనవాళ్లను నిరూపించి ఈ వారసత్వాన్ని రక్షించాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.