News

ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

7views

గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో   గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

గోధ్రా అల్లర్లు భారత చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన. గుజరాత్‌లో మత కల్లోలానికి దారి తీసింది. తరుచు గోధ్రా మత ఘర్షణలకు వేదికగా నిలిచింది. 2002 వరకు ఈ మత ఘర్షణలు కొనసాగాయి. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారింది. గోధ్రాలోని 7వ వార్డు పూర్తిగా ముస్లిం మెజారిటీ ప్రాంతం, ఒక్క హిందూ ఓటర్ కూడా లేరు. అయినప్పటికీ, ఈ ప్రాంతం నుంచి సోనీ సామాజికి వర్గానికి చెందిన హిందూ మహిళ అపేక్ష సోనీ సంచలన విజయం సాధించారు.

ఈ విజయంపై అపేక్ష మాట్లాడుతూ.. గోధ్రాలో అనేకసార్లు అల్లర్లు జరిగాయని, అయితే ఈసారి మాత్రం ముస్లిం సమాజం తనపై విశ్వాసం ఉంచారని చెప్పింది. గుజరాత్‌లో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలను  తెలిశాయి. మొత్తం 15 నగరాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.