News

పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు

78views

పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక ప్యాకేజీతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.  సంస్థ కార్యాలయంలో ప్యాకేజీ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్‌ రాజా వివరాలు వెల్లడించారు.

  •  ఏప్రిల్‌ 27న విశాఖపట్నం నుంచి బయలుదేరి 8 రోజుల పాటు.. కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, తిరుచ్చి, తంజావూరు, అరుణాచలం తదితర ప్రాంతాలు సందర్శించవచ్చని చెప్పారు. టీ, టిఫిన్, భోజనం, రవాణా, హోటల్‌ గదులతో కలిపి టికెట్‌ ధర ఒక్కొక్కరికీ రూ.14,700 ఉంటుందన్నారు. తుని, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగుతుందని.. ఈ అవకాశాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
  •  ఐదు రోజుల మరో యాత్రలో విమాన ప్యాకేజీ అందుబాటులో ఉందని ఈ ప్యాకేజీ ద్వారా తంజావూరు, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్‌ తదితర ప్రాంతాలు సందర్శించవచ్చని చెప్పారు. యాత్ర ఏప్రిల్‌ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుందని.. టికెట్‌ ధర రూ.37,900 ఉంటుందని చెప్పారు. టికెట్లు బుకింగ్‌ ఇతర వివరాల కోసం ఫోన్‌ నంబరు 9281495848, 7670900698లో సంప్రదించాలని కోరారు.