నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్లోని రాజ్గర్లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
209views
You Might Also Like
నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ నిపుణ్
28
సముద్ర గర్భంలోకి చొచ్చుకెళ్లి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించే సత్తా కలిగిన స్వదేశీ డైవింగ్ సహాయక నౌక (డీఎ్సవీ) ‘ఐఎన్ఎస్ నిపుణ్’ సోమవారం భారత నౌకాదళంలో చేరింది....
షరియా కంటే రాజ్యాంగమే ఉన్నతం : VHP
30
ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన "రాజ్యాంగ మరియు షరియా పరిరక్షణ ఉద్యమం"ను విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన దేశమని,...
స్వయంసేవకులను లక్ష్యం వైపు నడించే మాధ్యమం సంఘ గీత్ : పరాగ్ అభ్యంకర్
40
భువనేశ్వర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగర్ లోని ‘షట్ కంఠే శతాబ్ది రా స్వర’ పేరుతో అపూర్వ సంగీత...
బంగ్లాదేశ్ పౌరుడి పాస్పోర్టు రెన్యువల్కు రూ.5 లక్షలు డిమాండ్.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
32
మాచర్ల: బంగ్లాదేశ్ పౌరుడి పాస్పోర్టు పునరుద్ధరణకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో సుమారు మూడు...
టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ
43
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు....
పాకిస్థాన్లో శతాబ్దం నాటి హిందూ ఆలయం కూల్చివేతను తీవ్రంగా ఖండించిన భారత్
42
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవాల్ జిల్లాలో శతాబ్దం నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ‘అత్యంత అభ్యంతరకరమైన...





