నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్లోని రాజ్గర్లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
193views
You Might Also Like
లష్కరే, జైష్, హిజ్బుల్ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తున్న ఐఎస్ఐ
6
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ల కార్యకలాపాలపై...
లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్
16
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా...
ఇకపై నేరుగా తిరుపతికే.. విదేశీ శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!
26
తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్గా...
ఏజెన్సీ అడవులకు ‘విత్తన బంతుల’తో కొత్త ఊపిరి
30
విశాఖ ఏజెన్సీ: ఒకప్పుడు విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, సమృద్ధిగా వృక్ష, జంతు సంపదకు నిలయంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో క్రమంగా అటవీ...
శబరిమల రైల్వే ప్రాజెక్టుల పురోగతి
23
తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు...
గోశాలల స్వావలంబనకు యూపీ సర్కార్.. గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్
39
లక్నో: గోశాలలను ఆర్థికంగా స్వావలంబనగా మార్చడంతో పాటు ఆయుర్వేద, సేంద్రియ వ్యవసాయ రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోమూత్ర సేకరణకు పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఎంపిక...





