News

8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం

76views

నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్‌కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్‌లోని రాజ్‌గర్‌లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.