నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్లోని రాజ్గర్లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
165views
You Might Also Like
#FreeAfghanWomen: కొన్ని సెకన్ల వీడియో.. ప్రపంచ మనస్సాక్షిని కదిలిస్తున్న ఉద్యమం!
"Nobody is free until everybody is free." (అందరూ స్వేచ్ఛగా ఉన్నప్పుడే నిజమైన స్వేచ్ఛ.)అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు ఫ్యానీ లూ హేమర్ దశాబ్దాల క్రితం...
భిక్ష – సనాతన ధర్మంలో పవిత్ర సంప్రదాయం
భిక్షాటన – యాచన కాదు, వినయం, ధర్మం, వైరాగ్యానికి ప్రతీక "ద్వారం ద్వారం అటన్ భిక్షుః బోధతే న తు యాచతే । అదత్వా మాదృశో మాభూత్...
భక్తిశ్రద్ధల మధ్య అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం
6
అనకాపల్లి: జగన్నాథ స్వామి భక్తుల జయజయధ్వానాల మధ్య అనకాపల్లిలో జగన్నాథ స్వామివారి వార్షిక రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని అగ్గిమర్రి చెట్టు సమీపంలో ఉన్న...
భోజ్శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ
6
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా ప్రాంగణం కేసులో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోజ్శాలను సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ...
ఔషధ మొక్కల సాగు ఆయుష్ హబ్గా ఆంధ్రప్రదేశ్
7
విజయవాడ: ప్రాచీన ఆయుష్ వైద్య విధానాలకు పునరుజ్జీవం కల్పించడంతో పాటు ఔషధ మొక్కల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ను ఆయుష్ వైద్య హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర...
భాగ్యనగర్లో డేరింగ్ హిందూ ఆటో డ్రైవర్కు VHP జాతీయ నేత అండ
6
భాగ్యనగర్లోని అత్తాపూర్లో భరత్ కుమార్ అనే ఆటో డ్రైవర్ పై జరిగిన దాడి ఘటనపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని VHP...




