నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్లోని రాజ్గర్లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
143views
You Might Also Like
సింధూ నాగరికతను తామే నిజమైన వారసులం ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..
47
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్కు ‘‘సింధూ నది...
నీటి నిల్వలో అపర భగీరధులు
సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త...
అయోధ్య నిధుల కేసు అత్యవసర విచారణకు తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
44
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో పిల్...
ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమ సారథి సంఘ్
అత్యవసర పరిస్థితిని విధించిన పది రోజులకి, జూలై 4,1975న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మీద నిషేధం విధించింది. అదే సమయంలో నిషేధానికి గురైన...
గోమూత్రంతో చికున్గున్యాకు చెక్!
42
న్యూఢిల్లీ: భారతీయ సాంప్రదాయ జ్ఞానం, ఆధునిక శాస్త్రీయ పరిశోధనల సమన్వయానికి మరో ఉదాహరణగా నిలిచే ఆసక్తికర ఫలితాలను ఐఐటీ రూర్కీ పరిశోధకులు వెల్లడించారు. గోమూత్రం ఆధారంగా రూపొందించిన...
ముంబై హార్బర్ లైన్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు
49
ముంబైలోని హార్బర్ లైన్ మార్గంలో నడిచే ఏసీ లోకల్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు అంటించి ఉన్నాయి. పన్వెల్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్...





