
199views
శ్రీశైల క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మహా శివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 13,14 తేదీలలో ‘అన్న ప్రసాద వితరణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా శివరాత్రి రద్దీ దృష్ట్యా ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అన్ని దానాలలో కెల్ల అన్నదానం మిన్న అని, ఆ ఈశ్వరుని కృప వల్లే ఇతరుల ఆకలి తీర్చే మహాసేవ చేసే భాగ్యం దక్కిందని తెలిపారు.

అలాగే మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఇందులో భాగంగా చికిత్స అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, ఔషదాలు ఉచితంగా వితరణ చేశారు.






