News

50 మంది మరాఠా వీరులు.. 1800 మంది మొఘల్ సైనికులను ఎలా తరిమికొట్టారు?

119views

చరిత్రలోనే అసాధారణమైన యుద్ధం అది. కేవలం 50 మంది మరాఠా సైనికులు, 1,800 మందికి పైగా మొఘల్ సైనికులను తరిమికొట్టి సింహగఢ్ కోటను (కొండానా కోట) కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత పోరాటానికి నాయకుడు మరాఠా సేనాపతి ‘తాన్హాజీ మలుసరే’. ఈ విజయం అంత తేలికగా దక్కలేదు. నిటారుగా ఉన్న కోట శిలలు, పర్వత ప్రాంతంలోని లోతైన లోయలు, చిమ్మచీకటి రాత్రి, మరియు కోట బురుజులన్నింటిపై మొఘల్ సైనికుల కట్టుదిట్టమైన కాపలా.. ఇన్ని ప్రమాదాల మధ్య తాన్హాజీ తన 50 మంది సహచరులతో మృత్యువు కళ్ళలోకి చూస్తూ ముందడుగు వేశారు. సింహగఢ్ కోటపై జరిగిన ఆ రాత్రి యుద్ధం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎప్పుడైతే ఆ 50 మంది మరాఠా వీరులు మొఘల్ సామ్రాజ్య జెండాను పీకేసి, అక్కడ భగవా ధ్వజాన్ని (మరాఠా జెండా) ఎగురవేశారో, అది దక్కన్ రాజకీయ గమనాన్నే శాశ్వతంగా మార్చేసింది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు ప్రతిష్ట

సహ్యాద్రి పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తున ఉన్న సింహగఢ్ కోట, మరాఠా సామ్రాజ్యానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. పుణేతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భద్రతకు ఈ కోట ప్రధాన రక్షణ కవచం వంటిది. అయితే, మొఘల్ ఆక్రమణదారుడు ఔరంగజేబు తన కపట నీతితో ఒక ఒప్పందం ద్వారా ఈ కోటను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది మరాఠా ఆత్మగౌరవంపై నేరుగా జరిగిన దాడి వంటిది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఆయన తల్లి జీజాబాయి, సింహగఢ్ కోటను మళ్ళీ దక్కించుకోవడాన్ని తమ ప్రతిష్టాత్మక లక్ష్యంగా భావించారు. ఈ బాధ్యతను శివాజీ మహారాజ్ తన అత్యంత నమ్మకస్థుడైన మిత్రుడు, వీరుడైన తాన్హాజీ మలుసరేకు అప్పగించారు. మరోవైపు, మొఘలులు ఆ కోట రక్షణ బాధ్యతను సంరక్షకుడు (కిలేదార్) ఉదయభాన్ రాథోడ్‌కు అప్పగించారు.

తాన్హాజీ మలుసరే ముందు సింహగఢ్ కోటపై దాడి చేయడం ఒక పెద్ద సవాలుగా నిలిచింది, ఎందుకంటే: 

సాహసోపేతమైన ప్రణాళిక

కోట చుట్టూ నిటారుగా ఉండే కొండ చరియలు, 40 అడుగుల ఎత్తైన గోడలు, మరియు వాటి కింద లోతైన లోయలు ఉండటంతో ఆ కోట దాదాపు అభేద్యంగా (జయించడానికి వీలు లేనిదిగా) ఉండేది. కానీ తాన్హాజీ స్థానిక కోలీలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని, కోట యొక్క భౌగోళిక స్థితిగతులపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత, మొఘలులు కలలో కూడా ఊహించని ఒక ప్రమాదకరమైన ప్రదేశం నుండి కోటను ఎక్కాలని ఆయన నిర్ణయించుకున్నారు. లోతైన లోయలు ఉన్న ‘డోంగ్రీ’ కొండ చరియలే ఆ ప్రదేశం. 1670 ఫిబ్రవరి 4వ తేదీ చిమ్మచీకటి రాత్రిలో, తాన్హాజీ రస్సుల (తాళ్ల) సాయంతో కోట ఎక్కే సాహసోపేతమైన ప్రణాళిక వేశారు. ఆయన సుమారు 300 మంది సైనికులతో కలిసి కొండ ఎక్కడం ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 50 మంది మరాఠా సైనికులు మాత్రమే కోట పైభాగానికి చేరుకోగలిగారు, అంతలోనే రస్సు (తాడు) తెగిపోయింది. ఇది ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన మరియు నిర్ణయాత్మకమైన మలుపు. ఇప్పుడు తాన్హాజీ తన వద్ద ఉన్న కేవలం 50 మంది సైనికులతో, కోటలో ఉన్న సుమారు 1800 మంది మొఘల్ సైనికులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Sinhagad Fort

కోట లోపలికి ప్రవేశించిన వెంటనే మరాఠా సైనికులు.. కాపలాదారులపై కత్తులతో విరుచుకుపడ్డారు.

కల్యాణ్ ద్వారం మరియు కోటలోని ఇతర ప్రవేశ ద్వారాల వద్ద మోహరించిన మొఘల్ సైనికులు తాన్హాజీ కత్తి దెబ్బకు తలవంచక తప్పలేదు. ఆయన కత్తి వేటుకు ఎందరో మొఘల్ సైనికుల తలలు మొండెం నుండి వేరుపడ్డాయి. చూస్తుండగానే సుమారు 700 మంది మొఘల్ సైనికులు హతమయ్యారు. యుద్ధరంగంలో తాన్హాజీ ఉనికి మరాఠా సైనికులలో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. కేవలం ఆ 50 మంది సైనికులు మొఘల్ సేనలో పెను అలజడిని సృష్టించారు. మొఘల్ సైనికులు భయంతో పరుగులు తీస్తూ తమ కిలేదార్ (కోట సంరక్షకుడు) ఉదయభాన్ రాథోడ్ వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే, అంతకుముందే ఉదయభాన్ సేనాపతి మరియు అతని 12 మంది కుమారులు తాన్హాజీ కత్తి దెబ్బలకు బలైపోయారు.

ఇక ఇప్పుడు తాన్హాజీ ముందు కోట సంరక్షకుడు (కిలేదార్) ఉదయభాన్ రాథోడ్ నిలబడ్డాడు. ఇద్దరూ మహావీరులే. వారి మధ్య యుద్ధం అత్యంత భీకరంగా మొదలైంది. తాన్హాజీ పరాక్రమం ముందు ఉదయభాన్ ఎక్కువ సేపు నిలబడటం సాధ్యం కాలేదు, కానీ అదే సమయంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఉదయభాన్ రాథోడ్ కత్తి వేటుకు తాన్హాజీ డాలు (shield) విరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన దాడిలో తాన్హాజీ ఎడమ చేయి తెగి కింద పడిపోయింది. రక్తం ధారగా కారుతోంది. అయినా సరే, తాన్హాజీ వెనకడుగు వేయకుండా తన కుడిచేత్తో యుద్ధాన్ని కొనసాగించారు. తన చివరి మరియు నిర్ణయాత్మకమైన దెబ్బతో ఉదయభాన్‌ను అంతమొందించాడు. ఉదయభాన్ మరణించగానే మిగిలిన మొఘల్ సైనికులు భయంతో పారిపోయారు. అలా సింహగఢ్ కోట మళ్ళీ మరాఠాల వశమైంది. కానీ, ఈ యుద్ధంలో తాన్హాజీ వీరమరణం పొందారు. సింహగఢ్ కోట విజయం మరియు తాన్హాజీ బలిదానం గురించి తెలిసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయన నోటి నుండి వచ్చిన ఒక అమర వాక్యం నేటికీ మహారాష్ట్రలో సామెతగా నిలిచిపోయింది: ‘గఢ్ ఆలా పణ్ సింహ గేలా’ అంటే.. ‘కోట అయితే వచ్చింది కానీ, నా సింహం (తాన్హాజీ) వెళ్ళిపోయింది’.”

1600వ సంవత్సరంలో జన్మించిన తాన్హాజీ, తన 70వ ఏట.. అంటే 1670 ఫిబ్రవరి 4వ తేదీన సింహగఢ్ యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందారు. ఆయన చిన్నతనంలోనే తన తండ్రి సర్దార్ కోలాజీ నుండి గుర్రపు స్వారీ, కత్తిసాము మరియు గెరిల్లా యుద్ధ తంత్రాలను నేర్చుకున్నారు. మావల్ ప్రాంతంలోని కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో పెరగడం వల్ల, తాన్హాజీ పర్వత ప్రాంత యుద్ధ కళలలో మరియు యుద్ధ వ్యూహరచనలో ఆరితేరారు. తన తండ్రి సర్దార్ కోలాజీ మరణం తర్వాత ఆయన ఉమరతే గ్రామానికి సర్దార్ అయ్యారు. తన యుద్ధ నైపుణ్యం మరియు అచంచలమైన వీరత్వం కారణంగా ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అత్యంత ఆత్మీయులలో ఒకరిగా నిలిచారు. మాతా జీజాబాయి ఆయనను తన సొంత కుమారుడిలాగే ప్రేమించేవారు. సింహగఢ్ కోటను చేజిక్కించుకునే క్రమంలో ఆయన త్యాగం భారత చరిత్రలో అజేయమైన వీరత్వానికి గుర్తుగా నిలిచిపోయింది.