News

అరుంధతీ రాయ్.. భారత వ్యతిరేకతనే తన గుర్తింపుగా ఎలా మార్చుకున్నారు?

171views

ఆగష్టు 11, 2023 న, ఢిల్లీలో తాను ఎదుర్కొన్న భయాన్ని గురించి అరుంధతీ రాయ్ ఒక ప్రకటన చేశారు. “నేను ఢిల్లీలోనే ఉంటున్నాను. నాకు రోడ్డుపై వెళ్లడానికి చాలా భయంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా, కాషాయ కండువాలు ధరించిన 50 మంది మనుషులు వస్తారు. మీరు మీ తల్లిదండ్రులను చూడటానికి ఢిల్లీ నుండి అలీగఢ్‌కు వెళుతూ ఉండవచ్చు. అకస్మాత్తుగా మీరు అక్కడే చనిపోవచ్చు. మనం ఇప్పుడు ఇలాంటి దేశంలో జీవిస్తున్నాము.” అని ఆ ప్రకటన సారాంశం.

చివరికి, అరుంధతీ రాయ్.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె రాసిన వ్యాసాలలో మావోయిస్టులు మరియు కాశ్మీరీ వేర్పాటువాదులు హీరోలుగా మారారు. తిరుగుబాట్లను “ప్రతిఘటన” గా (resistance) అభివర్ణించారు. 2025లో, ఆమె ఢిల్లీలో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లలో నిందితుడైన ఉమర్ ఖాలిద్‌ను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. అంతేకాదు.. అతని ఖైదును వ్యతిరేకించారు (సెప్టెంబర్ 4, 2025). “కాశ్మీర్ ఎప్పుడూ భారతదేశంలో అంతర్భాగం కాదు” అని ఆమె తరచుగా ప్రకటనలు చేశారు. అంతేకాక, భారత సైన్యంపై ఆమె తరచుగా తప్పుడు ఆరోపణలు చేసేది. అత్యాచారాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ఆరోపణలు చేశారు.

ఆమె దృష్టిలో, భారతదేశంలో స్థాపించబడిన వ్యవస్థ లేదా అధికారులు.. ఎప్పుడూ తప్పు చేస్తుంటారు, ప్రభుత్వం ఎప్పుడూ అణచివేసేదే, వ్యతిరేకించేవారే ఎప్పుడూ సరైనవారే. అయితే ఆమె తీవ్రంగా విమర్శించిన ఈ భారతదేశమే, ఆమె తన వ్యక్తిగత గుర్తింపును నిర్మించుకోవడానికి ఒక ప్రధాన వేదికగా మారింది. ఆమె ఎంత ఎక్కువగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, అంత ఎక్కువగా ఆమె ప్రసిద్ధి చెందారు. ఫలితంగా, ఆమె ఒక సృజనాత్మక రచయిత్రిగా కాకుండా, “దేశ వ్యతిరేక” వైఖరిని కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయంగా మరియు జాతీయంగా భారతదేశాన్ని తప్పుగా చిత్రీకరించడమే.. ఆమె జీవితకథగా మారిపోయింది.