ArticlesNews

కృష్ణుడి నగరం ద్వారక ముస్లింల నివాస ప్రాంతంగా ఎలా మారింది ?

199views

కృష్ణుడి నగరం ద్వారక ముస్లింల నివాస ప్రాంతంగా ఎలా మారింది?
బేట్ ద్వారక అనేది సుదాముడు శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చిన ప్రదేశం. ద్వారక యొక్క ఈ తీరం పాకిస్తాన్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుండి కరాచీకి దూరం దాదాపు 105 కిలోమీటర్లు. ఈ కారణంగా.. ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ పాకిస్తాన్ చొరబాటుదారుల ఆధిపత్యం ఉండేది. సముద్ర మార్గం గుండా రెండు నుండి మూడు గంటల్లో పాకిస్తాన్ నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.

స్వాతంత్య్రం సమయంలో ఈ ప్రాంతం మత్స్యకారులకు ప్రసిద్ధి చెందింది. ఎక్కువ భాగం చేపలు పట్టే పనిని ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు చేసేవారు. పాకిస్తాన్ మరియు ముస్లిం సమాజం యొక్క ఈ బంధం ఈ ప్రదేశాన్ని ముస్లిం మత్స్యకారులకు ఒక కేంద్రంగా మార్చింది. అంతేకాదు 1945లో ఇక్కడ పాలన చేస్తున్న గైక్వాడ్ రాజవంశం కూడా ముస్లిం మత్స్యకారులకు అధికారికంగా స్థానం ఇవ్వక తప్పలేదు. కాలక్రమేణా ముస్లిం జనాభా నిరంతరంగా పెరుగుతూ పోయింది. బేట్ ద్వారకలో నివసిస్తున్న చాలా మంది అమ్మాయిలు పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇంకా పాకిస్తాన్ నుండి చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడ్డారు. (భాస్కర్)

బేట్ ద్వారకలో అడవులను నరికి సముద్రానికి చాలా దగ్గరగా అనేక మసీదులు మరియు మజారాలు నిర్మించబడ్డాయి. ఇవి ఎవరు, ఎప్పుడు నిర్మించారో చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా తెలియదు. చాలా నిర్మాణాలకు మజార్ లేదా దర్గా అని పేరు పెట్టారు. తద్వారా వాటి అసలు చరిత్ర ఎవరికీ తెలియకుండా ఉంటుంది. ఎవరూ తొలగించకుండా ఉంటారు కూడా. ఇక్కడ కోట్ల విలువైన భూమిని మసీదులు మరియు మజారాలు ఆక్రమించుకున్నాయి.

ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. ఈ ప్రాంతంలో ఆలయాల కంటే మసీదులు-మజారాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ద్వీపం జనాభా దాదాపు 12,000. ఇందులో 80%, అంటే సుమారు 9,500 మంది ముస్లింలు ఉన్నారు. 1960 జనాభా లెక్కల ప్రకారం.. ఇక్కడ ముస్లిం ఓటర్లు 600 మరియు హిందువులు 2,786 మంది ఉన్నారు. కాలక్రమేణా హిందువుల జనాభా 6,000 మరియు ముస్లింల జనాభా 1,200 ఉండవలసింది. కానీ హిందువుల సంఖ్య 960కి తగ్గింది మరియు ముస్లింల సంఖ్య 6,040 కి చేరుకుంది.

బేట్ ద్వారక పేరు అకస్మాత్తుగా వార్తల్లోకి ఎందుకు వచ్చింది?
ద్వారక ఎల్లప్పుడూ కృష్ణ ధామాల పేరుతోనే ప్రసిద్ధి చెందింది. కానీ డిసెంబర్ 2021లో ద్వారకలో ఉన్న బేట్ ద్వారక ద్వీపంపై సున్నీ వక్ఫ్ బోర్డు గుజరాత్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి.. బేట్ ద్వారకలోని రెండు ద్వీపాలపై తమకు యజమాన్య హక్కులు ఉన్నాయని వాదించింది. ఇది విన్న వెంటనే ప్రజలు ఆశ్చర్యపోయారు.

కృష్ణ నగరంలో మజారాలు మరియు మసీదులు.. ఆపై దానిపై వక్ఫ్ బోర్డు యొక్క దావా, ఇవన్నీ ప్రజలను ఆలోచించేలా చేశాయి. ల్యాండ్ జిహాద్ మరియు వక్ఫ్ యొక్క నియంతృత్వ దావాలపై ప్రశ్నలు లేవనెత్తడం మొదలైంది. ఈ ప్రాంతంలో ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని మరియు భూమి చారిత్రకంగా వారి వక్ఫ్ ఆస్తి అని సున్నీ వక్ఫ్ బోర్డు వాదించింది.

దీనిపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ సంగీత విశేన్ ధర్మాసనం.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు. “మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుసా? కృష్ణ నగరంలో భూమి యాజమాన్యాన్ని వక్ఫ్ బోర్డు ఎలా క్లెయిమ్ చేయగలదు?” కోర్టు ఈ దావాను పూర్తిగా తిరస్కరించింది. ఇంకా ఈ దరఖాస్తును “చట్టబద్ధంగా అసమంజసమైనది మరియు అక్రమమైనది” అని కూడా ప్రకటించింది. (సనాతన ప్రభాత్)

కాలక్రమేణా వివాదం పెరుగుతూ వచ్చింది. వక్ఫ్ బోర్డు యొక్క యాజమాన్యం మరియు దావాలపై నలువైపుల నుండి నిరసన మొదలైంది. ఇంతలో వక్ఫ్ బోర్డు మొత్తం వివాదం యొక్క దిశను మారుస్తూ, బేట్ ద్వారకపై తాము ఎలాంటి దావా వేయలేదని పేర్కొంది.

గుజరాత్ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు సజ్జాద్ హీరా ఇలా అన్నారు. “బేట్ ద్వారకలో ఎలాంటి భూమి కోసం వక్ఫ్ బోర్డు కోర్టులో దరఖాస్తు చేయలేదు. ఒక పిటిషన్ అమ్రేలీ జిల్లాలోని షియాల్ బేట్ గురించి ఉంది. దానిని వక్ఫ్ బోర్డు కాకుండా.. ఒక ప్రైవేట్ సున్నీ ట్రస్ట్ దాఖలు చేసింది. నియమం ప్రకారం మేము హాజరయ్యాము.. అంతే. అని చెప్పుకొచ్చారు.

గుజరాత్ హైకోర్టు సుమోటో విచారణ ద్వారా స్పష్టమైంది ఏమిటంటే.. వక్ఫ్ బోర్డు.. షియాల్ బేట్‌పై దావా వేసింది. బేట్ ద్వారకలోని రెండు ద్వీపాలపై కాదు. షియాల్ బేట్ అమ్రేలీ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే బేట్ ద్వారక, దేవభూమి ద్వారక జిల్లా పరిధిలోకి వస్తుంది.

షియాల్ బేట్‌పై సవాయి పీర్ అనే ఒక పీర్ (ముస్లిం సన్యాసి) యొక్క మక్బరా (సమాధి) ఉంది. సున్నీ ట్రస్ట్.. సవాయి పీర్ మరియు ఇతర్ పీర్ దర్గా మసీదు ట్రస్ట్ దీని యాజమాన్యం కోసం గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అధికారులు జాతీయ భద్రత ను ఉదహరిస్తూ.. సవాయి బేట్‌కు దగ్గరగా ఉన్న షియాల్ బేట్‌లో భక్తులను నిలిపివేశారు. ఈ పిటిషన్‌లో గుజరాత్ స్టేట్ వక్ఫ్ బోర్డు పేరు పిటిషనర్‌గా కాకుండా.. ప్రతివాదిగా ఉంది. (ఓన్లీ ఫ్యాక్ట్)

అక్రమ ఆక్రమణలను తొలగించడానికి బేట్ ద్వారకలో.. మహాఅభియాన్ –
2022 సంవత్సరంలో.. అక్రమ ఆక్రమణలను తొలగించాలని గుజరాత్ హైకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత స్థానిక ప్రభుత్వం.. అక్టోబర్ 2022లో బేట్ ద్వారకలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు మరియు మతపరమైన ఆక్రమణలను తొలగించే చర్యను ప్రారంభించింది. అక్రమ కబ్జాలను తొలగించే ఈ అభియాన్.. ద్వారక నుండి మొదలైంది ఇంకా దీనిని గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద కూల్చివేత డ్రైవ్ గా పరిగణించారు. (నవభారత్ టైమ్స్)

గుజరాత్ పోలీసులు, రెవెన్యూ, మెరైన్ మరియు అటవీ శాఖల సంయుక్త బృందాలు.. మొత్తం 335 ఆక్రమణలను తొలగించాయి. దీని ఫలితంగా బేట్ ద్వారకలో మొత్తం 1,00,642 చదరపు మీటర్ల ప్రాంతం ఖాళీ అయ్యింది. ఈ భూమి యొక్క మొత్తం ప్రభుత్వ విలువ రూ.53,04,25,500. భద్రతా కారణాల దృష్ట్యా.. మొత్తం ప్రాంతంలో 1,000 కంటే ఎక్కువ మంది పోలీసులు మోహరించారు. వదంతులను అరికట్టడానికి జామర్‌లు ఉపయోగించబడ్డాయి. (జాగరణ్ పంచజన్య)

మార్చి 2023లో గుజరాత్ మారిటైమ్ బోర్డు కూడా చర్యలు చేపట్టి, అక్రమంగా నివసిస్తున్న ముస్లిం మత్స్యకారులపై పట్టు బిగిస్తూ, ప్రభుత్వ భూమిపై నిర్మించిన ఇళ్లకు నోటీసులు జారీ చేసింది. ఆక్రమణలను తొలగించనప్పుడు.. గంధ్వికి చెందిన 69 మరియు సమీపంలోని నవదరకు చెందిన 122 మత్స్యకారుల ఇళ్లను కూల్చివేశారు. (ఇండియన్ ఎక్స్‌ప్రెస్)

గుజరాత్ హైకోర్టు ఫిబ్రవరి 4, 2025 న.. బేట్ ద్వారకలోని అక్రమ మతపరమైన ఆక్రమణలను సంరక్షిత ఆస్తులుగా పేర్కొన్న అన్ని పిటిషన్లను తిరస్కరించింది. ఈ పిటిషన్లలో ప్రభుత్వ భూమిపై ఉన్న మసీదులు మరియు దర్గాలను తొలగించే పరిపాలన చర్యను సవాలు చేశారు. కోర్టు ఆదేశం తర్వాత.. ఈ ఆక్రమణలను తొలగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

బేట్ ద్వారకలోని బాలాపర్ గ్రామంలో మొత్తం 12 అక్రమ మతపరమైన ఆక్రమణలు ఉన్నాయి. వీటిని కూడా తొలగించారు. అంతకుముందే బేట్ ద్వారక చుట్టుపక్కల ఉన్న 7 నిర్జన ద్వీపాలను అక్రమ కబ్జా నుండి విముక్తం చేశారు. అక్కడ మొత్తం 36 అక్రమ మతపరమైన మరియు వ్యాపార నిర్మాణాలను కూల్చివేశారు. (indiatv, organiser)