
భారత్ సెక్యులర్ దేశమని రాజ్యాంగం చెబుతుంది. కానీ అక్కడ అధిక సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేదు. వారి విశ్వాసాల పట్ల మైనారిటీలకు మర్యాద లేదు. చిరకాలంగా పాలిస్తున్న రెండు రాజకీయ పార్టీలకు గౌరవం లేదు. ఇక హిందూ దేవీదేవతలకు భద్రత ఎక్కడిది? ఒక మసీదుకో, చర్చ్కో నష్టం జరిగితే రాజకీయ పక్షాలు, మీడియా అక్షరాలా వీరంగం వేస్తాయి. ఈ పరిస్థితికి మొదటి కారణం ఇస్లాం మతోన్మాదులు. తరువాతి స్థానం కాంగ్రెస్, కమ్యూనిస్టులదే. ముస్లింలను బుజ్జగిస్తూ ఆ రెండు పార్టీలే గుత్తాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే హిందువులకు, హిందూ దేవస్థానాలకు కనీస రక్షణ ఉంటుందా? ఆ రెండు పార్టీలు అధికారం దగ్గర మాత్రమే విరోధులు. హిందువుల హక్కులను భగ్నం చేయడంలో దేని రికార్డు దానిదే. ముస్లిం మతోన్మాదం, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడి తిష్టవేసినదే కేరళ అనే దేవభూమి బిరుదాంకిత రాష్ట్రం. అక్కడి రెండు ప్రధాన దేవాలయాలు అయ్యప్ప, కృష్ణుడి దేవాలయాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సీపీఎం నాయకులు బందిపోట్లతో దీటుగా కోట్లు కోట్లు కొల్లగొట్టారు. బీజేపీ వంటి ‘హిందువుల పార్టీ’, విశ్వహిందూ పరిషత్ వంటి పోరాట సంస్థ నినాదాలు, ఘోష తప్ప మరెవ్వరూ నోరెత్తడం లేదు.
కేరళలోని పురాతన ఆలయాలు దేవసం బోర్డు అనే వాటి పరిధిలో ఉంటాయి. దేవసాల చేతిలో గుళ్లు ఉంటే, దేవసాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ వీటిని రాజకీయ నిరుద్యో గులతో నింపుతుంది. అందుకే దేవసాలు అవినీతి నిలయాలుగా ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 20న శబరిమలై, పంపా తీరంలో కేరళ సీపీఎం అంతర్జాతీయ అయ్యప్ప భక్తుల సదస్సు నిర్వహిం చింది. కానీ అప్పటికి అయ్యప్ప ఆలయంలో చోటా మోటా సీపీఎం నాయకులు బందిపోట్లను తలపిస్తూ ఆస్తులు కాజేశారు. హిందూ పురాణాలే ఇతివృత్తంగా కళా ప్రదర్శనలు జరగవలసిన దేవాలయ ఉత్సవా లలో ఎర్రజెండాలను ఎగరేసి, సుత్తులూ, కొడవళ్లూ, పిడికిళ్లు చిత్రించిన వేదికల మీద కమ్యూనిస్టు గీతాలను పాడే నీచ సంప్రదాయం ప్రవేశ పెట్టారు.
అయ్యప్ప, గురువాయూర్ ఆలయాలలో తాజాగా బయటపడిన బంగారం, వస్తువులు, పద్దులు, ఏనుగు దంతాల అక్రమాలు దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి. ఆ రెండు ఆలయాలలోనే రూ. 25 కోట్లు విలువ చేసే బంగారాన్ని కమ్యూనిస్టుల పాలనలోని దేవస్థానం బోర్డులు, ఉద్యోగులు మేసేశారు. న్యాయ స్థానాలు రంగంలోకి దిగితే తప్ప వీటి అసలు రహస్యం బయటకు రాలేదు. శబరిమలై ఆలయంలో జరిగిన బంగారం గోల్మాల్ మీద వేగంగా దర్యాప్తు చేయడానికి కేరళ హైకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. శబరిమలై ఆలయంలో దొంగతనం వెనుక పెద్ద కథే ఉంటుందని సాక్షాత్తు కేరళ హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది విస్తృతమైన పెద్ద ప్రణాళికతో చేసిన దొంగతనమని భావించవలసి ఉంటుందని కూడా అభిప్రాయపడిరది. అందుకే ఇంతకు ముందు ఉన్న స్పెషల్ కమిషనర్ పెట్టిన విధానాలను పక్కన పెట్టి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సాగే విధంగా ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.





