ArticlesNews

భారతీయతకు జన్‌-జడ్‌ జయహో

51views

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌`ఏబీవీపీ భారత క్యాంపస్‌లలో జన్‌-జడ్‌ ఆధిపత్య వాణిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యార్థుల విజయాలు, పెరుగుతున్న ప్రభావం క్యాంపస్‌ రాజకీయాల్లో తరాల మార్పును ప్రతిబింబిస్తుంది. ఏబీవీపీ జాతీయవాదం, యువత-కేంద్రీకృత కార్యాచరణ ఈ రెండిరటిలోనూ తనను తాను సుస్థిరపరుచుకుంది. సైద్ధాంతిక ఆకర్షణను అట్టడుగు స్థాయి క్రియాశీలతతో కలపడం ద్వారా విద్యార్థులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంది, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ ఎన్నికలలో ఒక బలీయమైన శక్తిగా అవతరించింది. భారతదేశం అంతటా జరిగిన తాజా విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదేమిటంటే ఏబీవీపీ క్యాంపస్‌ క్రియాశీలతలో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా కొనసాగుతోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ సెంట్రల్‌ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ఘన విజయాలతో తన ఉనికిని బలోపేతం చేసుకుంది. సాంప్రదాయకంగా సవాలు చేసే క్యాంపస్‌లలోకి తన ప్రభావాన్ని విస్తరించింది. విద్యార్థులలో తన తిరుగులేని విస్తృతిని నిరూపించుకుంది. ఈ ఫలితాలను ప్రత్యేకంగా నిలబెట్టేది విద్యార్థుల మద్దతు, సంస్థాగత పనితీరు స్థాయి. ఏబీవీపీ రెండు రోజుల వ్యవధిలో, దేశంలోని అత్యంత ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయా లలో రెండిరటిలో ఒకటైన అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన క్యాంపస్‌తో కూడుకున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం, చాలా కాలంగా కఠినమైన యుద్ధభూమిగా పరిగణనలో ఉన్న హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో చారిత్రాత్మక విజయాలను సాధించింది. ఏబీవీపీ జన్‌-జడ్‌తో జతకట్టి విద్య, నాయకత్వం, నిర్మాణాత్మక దేశ నిర్మాణంలో వారి ఆకాంక్షలను పరిష్కరించిన వైనానికి ఈ విజయాలు అద్దంపడుతున్నాయి.

ఈ విజయం యాదృచ్చికం కాదు. పంజాబ్‌, ఢిల్లీ నుండి పాట్నా, ఉత్తరాఖండ్‌, అస్సాం, దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర విశ్వవిద్యాలయాల వరకు క్యాంపస్‌లలో ఏబీవీపీ విజయ పరంపర కొనసాగు తోంది. ఇది దాని దేశవ్యాప్త లక్షణాన్ని విద్యార్థి సమస్యలలో దాని లోతైన మూలాలను ప్రతి బింబిస్తుంది. ఈ విజయాలు సైద్ధాంతిక స్పష్టత, విద్య, క్యాంపస్‌ సంబంధిత విషయాలలో సానుకూల జోక్యం, కార్యకర్తల అవిశ్రాంత నిబద్ధత మేలు కలయిక నుంచి ఉద్భవించాయి.

జన్‌-జడ్‌ నిర్మాణాత్మక జాతీయవాదాన్ని సమర్థిస్తుంది
నేటి జన్‌`జడ్‌ కోసం ఏబీవీపీ నిర్మాణాత్మక జాతీయవాద సందేశం విద్యార్థి రాజకీయాలను విద్య, నిజమైన సమస్యలు, యువత ఆకాంక్షలతో అనుసంధానించేదిగా ప్రతిధ్వనించింది. ఈ ఎన్నికల ఫలితం సానుకూల, సృజనాత్మక దేశ నిర్మాణానికి మార్గం చూపింది. ‘‘రాజ్యాంగాన్ని కాపాడటం’’ పేరుతో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇటీవల జన్‌`జడ్‌కి చేసిన విజ్ఞప్తి నేపాల్‌, బాంగ్లాదేశ్‌ వంటి భారతదేశ పొరుగు దేశాలలో రాజకీయ అస్థిరత, హింసతో తరచుగా ముడిపడి ఉన్న ప్రతికూలత ఇక్కడ కూడా ఏర్పడాలనే కుట్రపూరితమైన స్వరాన్ని వినిపించింది. దీనికి విరుద్ధంగా, క్యాంపస్‌లలో ఏబీవీపీ సాధించిన విజయాలు యువ భారతీయులు నిరాశావాదం, విభజన, వారసత్వ రాజకీయాలను తిరస్కరిస్తున్నారని సూచిస్తున్నాయి.

జాతీయ నాయకత్వం నుండి ఆమోదం
బీజేపీ సీనియర్‌ నాయకులు ఈ భావనను ప్రతిధ్వనించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ ఫలితాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థ) బీఎల్‌ సంతోష్‌ ‘‘ఏబీవీపీకి అద్భుతమైన జన్‌-జడ్‌ విజయం’’గా అభివర్ణించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దీనిని యువత ‘‘నేషన్‌ ఫస్ట్‌’’ అనే ఆలోచనపై అచంచలమైన నమ్మకానికి రుజువుగా ప్రశంసించారు. ఇంతలో, ‘‘ఓట్ల రిగ్గింగ్‌’’, ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపించడానికి ఎన్‌ఎస్‌యూఐ చేసిన ప్రయత్నాలు విద్యార్థులను ఆకట్టుకోలేకపోయాయి, వారు రికార్డు సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విభిన్న రాష్ట్రాలు. నేపథ్యాల నుండి వచ్చిన 1.5 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ ఫలితం యువత మానసిక స్థితికి విశ్వసనీయమైన ప్రతిబింబంగా మారింది.

ఢిల్లీ వర్శిటీలో చారిత్రక విజయం
జన్‌-జడ్‌ ‘తుక్డే-తుక్డే’ రాజకీయాలను తిరస్కరించింది, దేశ నిర్మాణ ఎజెండాకు మద్దతు ఇచ్చింది ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది, అధ్యక్ష, కార్యదర్శి, జాయింట్‌ సెక్రటరీ పదవులను రికార్డు ఆధిక్యంతో గెలుచుకుంది. ఇది కాంగ్రెస్‌ మద్దతుగల ఎన్‌ఎస్‌యూఐకి పెద్ద ఎదురుదెబ్బ. చారిత్రాత్మకంగా ప్రశంసనీయమైన ఈ విజయం జన్‌-జడ్‌ విభజన రాజకీయాలను తిరస్కరించడాన్ని , ఏబీవీపీ దేశ నిర్మాణ ఎజెండాను ఆమోదించడాన్ని ప్రతిబింబిస్తుంది.

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఘన విజయం సాధించి, సెంట్రల్‌ ప్యానెల్‌లో మూడు కీలక స్థానాలను గెలుచుకుంది, వాటిలో శక్తిమంతమైన అధ్యక్ష పదవి కూడా ఉంది. ఈ విజయాన్ని విభజన రాజకీయాలకు చారిత్రాత్మక ఓటమిగా, భారతదేశ జన్‌`జడ్‌ ఓటరు నిర్మాణాత్మక దేశ నిర్మాణానికి దృఢమైన ఆమోదంగా అభివర్ణించారు. ఏబీవీపీకి చెందిన ఆర్యన్‌ మాన్‌ 16,196 ఓట్ల తేడాతో డీయూఎస్‌యూ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఇది డీయూఎస్‌యూ అధ్యక్ష పదవి చరిత్రలో రెండవ అతిపెద్ద విజయం. ఆయనతో పాటు, కునాల్‌ చౌదరి 7,662 ఓట్ల తేడాతో కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు, దీపికా ఝా 4,445 ఓట్ల తేడాతో జాయింట్‌ సెక్రటరీగా విజయం సాధించారు.

‘‘ఈ విజయం కేవలం సంఖ్యల గురించి కాదు ఇది నేటి తరం దేశభక్తి చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని ఆర్యన్‌ మాన్‌ ప్రకటించారు. ‘‘ఢిల్లీ విశ్వవిద్యా లయ విద్యార్థులు స్పష్టమైన సందేశాన్ని పంపారు – దేశ వ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, బంధుప్రీతి ప్రోత్సహించే వారిని వారు గట్టిగా తిరస్కరిస్తారు. జన్‌`జడ్‌ దేశభక్తి, పారదర్శకత, నిజాయితీకి ఓటు వేశారు’’ అని అన్నారు. మెట్రో రాయితీ పాస్‌లు, చాలా అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా విద్యార్థి-కేంద్రీకృత సమస్యలను త్వరగా పరిష్కరిస్తా నని మాన్‌ హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన కార్యదర్శి కునాల్‌ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు ఐక్యత, జాతీయ ప్రయోజనాల రాజకీయాలను స్వీకరించడానికి ‘‘భ్రమలు, మోసాలకు అతీతంగా’’ ఉన్నారని ఫలితాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇది అవినీతి, అవకాశవాదాన్ని తిరస్కరించడం.. విద్యార్థి సంక్షేమం, పారదర్శకతలో పాతుకుపోయిన రాజ కీయాలను స్పష్టంగా అంగీకరించడం’’ అని ఆయన నొక్కి చెప్పారు. డీయూఎస్‌యూలో మహిళా అభ్యర్థులలో ఏబీవీపీ విజయ పరంపరను కొనసాగించిన దీపిక ఝా మాట్లాడుతూ తన విజయం ఏబీవీపీ నాయకత్వంపై మహిళా విద్యార్థులు ఉంచిన నమ్మకాన్ని సూచిస్తుందని తెలిపారు. ‘‘ఇది నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మహిళా అభ్యర్థులకు ఏబీవీపీ నిరంతరం అధికారం ఇస్తున్న వైనాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని ఆమె అన్నారు.

పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో తొలిసారి అధ్యక్ష పదవి కైవసం
1977లో ప్రత్యక్ష ఎన్నికలు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా పంజాబ్‌ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ విద్యార్థి మండలి (పీయూసీఎస్‌సీ) ఎన్నిక లలో ఏబీవీపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. ఏబీవీపీ తరపున పోటీ చేసిన 27 ఏళ్ల న్యాయ విద్యార్థి, రీసెర్చ్‌ స్కాలర్‌ గౌరవ్‌ వీర్‌ సోహల్‌, ఎనిమిది మంది అభ్యర్థుల పోటీలో తన సమీప ప్రత్యర్థి, స్టూడెంట్‌ ఫ్రంట్‌కు చెందిన సుమిత్‌ శర్మను 488 ఓట్ల తేడాతో ఓడిరచి చరిత్ర సృష్టించారు. ఇది విశ్వవిద్యాలయ ఎన్నికల రంగంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘానికి ఒక ముందడుగు. సుమిత్‌ శర్మ 2,660 ఓట్లు సాధించగా, సోహల్‌ 3,148 ఓట్లను సాధించారు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన పరాబ్‌జోత్‌ గిల్‌ 1,359 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఏఎస్‌ఏపీకి చెందిన మన్కిరత్‌ మాన్‌ 1,184 ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. ఎస్‌ఓఐకి చెందిన సీరత్‌ 422, ఎస్‌ఓపీయూకి చెందిన అర్దాస్‌ 318, పీఎస్‌యూ లాల్కార్‌కు చెందిన జోగన్‌ప్రీత్‌సింగ్‌ 198, అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ ఫోరం అభ్యర్థి 136 ఓట్లు సాధించారు. నోటాకు 188 ఓట్లు వచ్చాయి.

‘‘నా బృందం కృషి ఫలించినందుకు నేను సంతో షంగా ఉన్నాను. విశ్వవిద్యాలయ అధికారులతో ఏబీవీపీ సాన్నిహిత్యం గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి, కానీ మేము ఎవరితోనైనా సంబంధం లేకుండా విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని నేను స్పష్టంగా బిగ్గరగా ప్రకటించాలను కుంటున్నాను ’’అని ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోహల్‌ అన్నారు. 1977లో పీయూ విద్యార్థి ఆఫీస్‌ బేరర్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ప్రారంభించిన తర్వాత ఏబీవీపీ అధ్యక్ష పదవిని గెలుచుకోవడం ఇదే మొదటి సారి. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), పంజాబ్‌ పాలక ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన అసోసి యేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ ఫర్‌ ఆల్టర్నేటివ్‌ పాలిటిక్స్‌ (ఏఎస్‌ఏపీ), శిరోమణి అకాలీదళ్‌కు చెందిన స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్ఓ) అతి తక్కువ ఓట్లను పొందాయి.

పాట్నా వర్శిటీకి మొదటి మహిళా ఏబీవీపీ ప్రెసిడెంట్‌
బిహార్‌లోని పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (పీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి మైథిలి మృణాలిని చారిత్రక విజయం సాధించారు. ఆమె పీయూఎస్‌యూ అధ్యక్షురాలిగా ఎన్నికై, పాట్నా యూనివర్సిటీ 107 సంవత్సరాల చరిత్రలో మొదటి మహిళ అధ్యక్షురాలుగా నిలిచారు.

ఆమె కాంగ్రెస్‌కు చెందిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) అభ్యర్థి మనోరంజన్‌ కుమార్‌ రాజాను 603 ఓట్ల తేడాతో ఓడిరచారు. మృణాలిని 3,524 ఓట్లు పొందగా, ఆమె ప్రత్యర్థి 2,921 ఓట్లు సాధించారు. ఈ విజయాన్ని ఏబీవీపీ జాతీయవాద భావనలు, విద్యార్థుల శక్తి కలయికగా వర్ణించారు. మృణాలిని తన విజయాన్ని ‘‘ధనబలం, కండబలంపై ప్రజాస్వామ్య విజయం’’గా పేర్కొన్నారు.

ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ప్రధాన పాత్ర పోషించారు. మొత్తం 5 పదవుల్లో 3 పదవులను మహిళలు సాధించారు.

అధ్యక్షురాలు: మైథిలి మృణాలిని (ఏబీవీపీ)
సామాన్య కార్యదర్శి: సలోనీ రాజ్‌ (స్వతంత్ర అభ్యర్థి) – 4,274 ఓట్లు
కోశాధికారి: సౌమ్యా శ్రీవాస్తవ (ఎన్‌ఎస్‌యూఐ) – 2,707 ఓట్లు

ఇతర పదవులు:
ఉపాధ్యక్షుడు: ధీరజ్‌ కుమార్‌ (స్వతంత్ర అభ్యర్థి)
కార్యదర్శి: రోహన్‌ కుమార్‌ (ఎన్‌ఎస్‌యూఐ)

వోటర్‌ టర్న్‌అవుట్‌ 45.25%గా ఉంది. ఇది గత మూడు ఎన్నికల్లో అతి తక్కువ. ఏబీవీపీకి జేడీ(యూ) స్టూడెంట్‌ వింగ్‌ మద్దతు లేకపోయినా, ఆ పార్టీ అభ్యర్థులు లేకపోవడం వల్ల ఏబీవీపీకి ప్రయోజనం చేకూరింది. ఈ ఎన్నికలు మహిళలు, స్వతంత్రుల ప్రాధాన్యతను చూపించాయి.