
మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన బీహార్లోని గయా పట్టణాన్ని రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించారు. పూర్వీకులకు మోక్షాన్ని అందించే ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా గయ ప్రసిద్ధి పొందింది. శ్రీ మహావిష్ణువు గయాసురుడిని వక్షస్థలంపై తన పాదం ఉంచి చంపింది ఇక్కడే అని పురాణాలు చెబుతున్నాయి. దానికి నిదర్శనంగా ఇక్కడ మహావిష్ణువు పాదం ఉంటుంది. ఈ ఆలయ ప్రస్తుత నిర్మాణం 1787లో ఫాల్గు నది ఒడ్డున మహారాణి అహల్యాబాయిచే నిర్మించబడింది.
పెద్దలకు పుణ్యలోకాలు సంప్రాప్తించాలని కోరుకుంటూ మహాలయ పక్షం సమయంలో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర పట్టణాన్ని సందర్శిస్తారు. ఇటీవల ముగిసిన పితృపక్షం సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించారు. , సెప్టెంబర్ 7 నుండి 21 మధ్య రికార్డు స్థాయిలో 3.1 మిలియన్లకు పైగా భక్తులు సందర్శంచారు. పితృపక్ష మేళా సందర్భంగా 31,77,000 మందికి పైగా భక్తులు గయలోని విష్ణుపాద ఆలయానికి చేరుకుని పిండ దానం మరియు తర్పణం చేశారు, 2024లో పవిత్ర స్థలాన్ని సందర్శించిన భక్తుల సంఖ్యతో పోలిస్తే దాదాపు పది లక్షల మంది గణనీయంగా పెరిగారు.
ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, రెండు వారాల పాటు జరిగిన ఈ ఉత్సవంలో చివరి రోజున దాదాపు 3 లక్షల మంది భక్తులు విష్ణుపాద ఆలయాన్ని సందర్శించారు. ఈ సంవత్సరం పవిత్ర సందర్భం ఫాల్గు నది ఒడ్డున జరిగిన పితృపక్ష మేళా విదేశీయులను కూడా ఆకర్షించింది. అంతకుముందు సెప్టెంబర్ 20న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా బీహార్లోని గయా ని సందర్శించిన విషయం తెలిసిందే.





