News

ఆలయాల్లో ఎటువంటి పనులైనా… అనుమతులు తప్పనిసరి

260views

రాష్ట్రంలోని ఆలయాల్లో నిర్మాణాలు, ఉత్సవాల సమయంలో తాత్కాలిక పనులకు తప్పనిసరిగా అనుమతులు, డిజైన్, ప్లానింగ్‌ ఉండాల్సిందేనని, భక్తుల భద్రత విషయంలో రాజీ పడకూడదని త్రిసభ్య కమిటీ స్పష్టంచేసింది. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై విచారణ జరిపిన కమిటీ.. ఇకపై ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సిఫారసులు చేసింది…

  • అర్హత కలిగిన ఇంజినీర్లతోనే డిజైన్లు రూపొందించాలి.
  • సాంకేతిక, పరిపాలనా పరమైన అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టకూడదు.
  • ఎం-బుక్స్, సైట్‌ రిజిస్టర్లు, రోజువారీ ప్రగతి నివేదికలు, మెటీరియల్‌ను పరీక్షించిన రిపోర్టులు తప్పనిసరిగా ఉండాలి.
  • ఇటుకలు, కాంక్రీట్‌ వంటి మెటీరియల్‌కు నాణ్యత పరీక్షలు నిర్వహించాలి.
  • ఇంజినీరింగ్‌ ప్రమాణాలకు సరిపడే మెటీరియల్స్‌నే వినియోగించాలి.
  • సరైన క్యూరింగ్‌ సమయం పాటించాలి.
  • గోడలను నిర్మించే ముందు నేల స్వభావాన్ని చూడాలి.
  • గోడల నిర్మాణంలో నిర్దేశిత లోతులో పునాదులు తీయాలి.
  • గోడ వెనుక నీరు చేరకుండా డ్రైనేజీ ఛానల్‌ ఏర్పాటుతోపాటు, గోడకు వీప్‌ హోల్స్‌ ఏర్పాటు చేయాలి.
  • నీటి ప్రవాహ మార్గాలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
  • సమన్వయం ఉంటేనే..

  • దేవాదాయశాఖ, ఆలయ అధికారులు, పర్యాటక సంస్థ మధ్య సమన్వయం కోసం ప్రోటోకాల్‌ ఏర్పాటు చేయాలి.
  • ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలో అందులో స్పష్టంగా ఉండాలి.
  • తొలుత అనుకున్న పనిలో మార్పులు ఉంటే, సమీక్షించి వాటికి ఆమోదం తెలపాలి.
  • అనధికార అభ్యర్థనలు, రాజకీయ ఒత్తిళ్లతో నిర్మాణంలో మార్పులు చేయకూడదు.
  • ప్రధాన ఉత్సవాల సమయంలో భద్రతాపరమైన ఆడిట్, వసతుల కల్పనపై స్పష్టమైన అంచనా ఉండాలి.
  • తాత్కాలిక నిర్మాణాలు వద్దు

  • తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దు. తప్పనిసరి అయితే ఇంజినీరింగ్, పరిపాలనా పరమైన ఆమోదం తీసుకోవాలి.
  • ఇంజినీర్లు, సూపర్‌వైజర్లకు భద్రతాపరమైన అంశాలు, నిర్మాణాల్లో చేపట్టే ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి.
  • ఇంజినీరింగ్‌ ప్రమాణాలపై ఆలయ అధికారులకు అవగాహన కల్పించాలి.
  • అనధికార నిర్మాణాలు చేసినప్పుడు.. అధికారులు, గుత్తేదారును బాధ్యులను చేసేలా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ) సిద్ధం చేయాలి.
  • ఉల్లంఘనలు, నిర్లక్ష్యంపై తగిన శిక్ష విధించేలా, చట్టపరమైన చర్యలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.