
383views
అమర్నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్వేలను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ వరకు 11.60 కి.మీ. మేర ఓ రోప్వేతో పాటు బడ్గాం, రామ్బన్ జిల్లాల్లో నిర్మించాల్సిన రెండు రోప్వేలు ఈ జాబితాలో ఉన్నాయి. శంకరాచార్య ఆలయం వద్ద రోప్ వే నిర్మాణ ప్రక్రియ డీపీఆర్ దశలో ఉందని పేర్కొంది.
ఏటా అమర్నాథ్ యాత్రకు 3 లక్షలకుపైగా భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. ప్రకృతి అనుకూలించని సమయాల్లో గుహ వద్దకు ఎవరినీ అనుమతించరు. దీంతో ఏడాదితో మూడు నెలలు మాత్రమే యాత్రలో భక్తులు పొల్గొనగలుగుతున్నారు.





