తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం చిన్నశేషవాహనం పై శ్రీమలయప్పస్వామి దర్శమిస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాధుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగుర వేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసిందని అన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను టిటిడి కల్పించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
31
You Might Also Like
నారీశక్తికి ప్రతీక రాణి దుర్గావతి
* 500వ జయంతి సందర్భంగా సంస్మరణ - హనుమత్ ప్రసాద్ రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి వున్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురి మావోయిస్టుల మృతి
20
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-...
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
35
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు....
తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి : చంద్రబాబు
24
తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘కొండపై గోవింద నామస్మరణ...
నవరాత్రుల సందర్భంగా IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ..
26
మీరు నవరాత్రుల సమయంలో ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా IRCTC అద్భుతమైన టూర్...
హిందూపేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న పాక్ జాతీయులు
దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్...