న్యూఢిల్లీలోని ఎర్రకోటపై ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన రైతులు దోమ మోహనరావు, పుణ్యవతి దంపతులకు ఆహ్వానం అందింది. మోహనరావు దంపతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగించి.. యాంత్రీకరణ విధానం ద్వారా అధిక దిగుబడి సాధించారు. బిందుసేద్యం ద్వారా మెట్టు పంటలు పండించి ఉత్తమ రైతుగా గుర్తింపు పొందారు. సాగులో ఈ దంపతుల ప్రతిభను గుర్తిస్తూ.. పీఎం కిసాన్ పథకం కింద వారిద్దరినీ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపిక చేసినట్టు స్థానిక వ్యవసాయాధికారి సువ్వారి గోవిందరావు తెలిపారు. వీరి ఎంపికపై జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, గోవిందరావుతోపాటు పలు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాగా.. రానున్న రోజుల్లో ఎరువులు, రసాయనాలు లేకుండా ఆర్గానిక్ పంటలు పండించేలా దృష్టి సారిస్తున్నానని రైతు మోహనరావు తెలిపారు. సఫలీకృతమైతే జిల్లావ్యాప్తంగా ఈ విధానంపై ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.
46
You Might Also Like
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
15
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది....
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
12
మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. శరన్నవరాత్రులలో రేణుకా మాత...
ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి… పొదల్లో మృతదేహం
27
ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన...
మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి
18
బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం,...
భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత
12
పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి....
గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ
25
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి...