News

బంగ్లాదేశ్ సర్కార్‌ని కూల్చినందుకు అల్ ఖైదా అభినందనలు.. షరియా పాలన తేవాలని సలహా

43views

ఓ వైపు బంగ్లాదేశ్ లోని హిందువులను చిత్ర హింసలు పెడుతూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ… ఇస్లామిక్ మూకలు భయోత్పాదం సృష్టిస్తున్న సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ఏషియా విభాగం ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 12 పేజీల ఈ ప్రకటన దాని నాయకుడు ఒసామా మహమూద్ పేరుతో విడుదలైంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసినందుకు ప్రజలను అభినందించాడు. ఇస్లామిస్టులకు, జిహాదీలకు ఇదో పెద్ద విజయంగా అందులో అభవర్ణించాడు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఎవ్వరూ భాగస్వాములు కావొద్దని, బంగ్లాదేశ్ లో నూటికి నూరుపాళ్లు షరియా పాలనను స్థాపించే ప్రయత్నాలల్లో నిమగ్నమై వుండాలని కూడా ఈ లేఖలో సూచించాడు. ఈ విషయంపై నిరంతర ప్రయత్నాలుండాలని ఒసామా మహమూద్ అన్నాడు. బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ అల్లరి మూకల చేతుల్లోకి వెళ్లిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఇస్లామిక్ మూకలు మరింత రెచ్చిపోతున్నారు. హిందువులే టార్గెట్ గా వెతక్కుంటూ మరీ దాడులకు దిగుతున్నారు. ఆయుధాలతో కూడా వీధుల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ ఓ వైపు కాగా.. మరో వైపు ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ అయిన ‘‘జమాతే ఇస్లామీ’’ తన కార్యాలయాన్ని 13 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌లోని మోగ్ బజార్ బోరో బజార్‌లో ప్రారంభించింది. నిజానికి షేక్ హసీనా ఈ సంస్థను నిషేధించింది. ఇప్పుడు ఆమె దేశంలో లేకపోవడంతో మళ్లీ ఈ ఛాందవాస సంస్థ తన కార్యాకలాపాలను ప్రారంభించిందంటే పరిస్థితి అక్కడ ఎలా వుందో ఊహించుకోవచ్చు. అలాగే పార్టీ మాజీ అధ్యక్షుడు మోతియుర్ రెహ్మన్ నిజామీ, మాజీ ప్రధాన కార్యదర్శి అలీ అహ్సన్ మహ్మద్ ముజాహిద్‌ను యుద్ధ నేరాల ఆరోపణలపై ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ కార్యాలయాన్ని మూసేశారు.