News

అర్ధరాత్రి పశువుల అక్రమ రవాణా

52views

గత కొంత కాలంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రూరల్‌ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామం కేదారిపురం కేంద్రంగా స్థానికుల సహకారంతో పశువుల అక్రమ రవాణా సాగుతోంది. పోలీసులు పలుమార్లు దాడులు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారం మేరకు రూరల్‌ ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మణ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడి చేసి 22 పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యానును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఎనిమిది ఎద్దులు, పదకొండు ఆవులు, మూడు దూడ లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట అలమండ సంతకు తీసుకువెళ్లి అ క్కడి నుంచి కబేళాకు తరలిస్తున్నట్లు డ్రైవర్‌ పోతూరు ఆంజనేయులు పోలీసులకు తెలిపాడు. అక్రమ రవాణాకు కారకుడైన కేదారిపురం గ్రామానికి చెందిన సంతోష్‌ రౌళోను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణ తెలిపారు.