వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవీకరణ పనుల నేపథ్యంలో సెప్టెంబరు 8న బాలాలయ ప్రతిష్ఠను నిర్వహిస్తామని టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ పేర్కొన్నారు. రామయ్య క్షేత్రంలో గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమాన గోపురం నవీకరణ, మరమ్మతులు రూ.57.48 లక్షలతో భారతీయ పురాతత్త్వ సర్వేక్షణశాఖ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని అధికారులు పరిశీలించి సమావేశం నిర్వహించారు. వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబరు 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అవి పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించాలని తితిదే అధికార యంత్రాంగం నుంచి అభ్యర్థనలు రావడంతో పురావస్తుశాఖ అధికారులు అంగీకరించారు. ఆ సమయంలో పాత కల్యాణ మండపంలో భక్తులకు స్వామి దర్శన ఏర్పాట్లు చేయాలని సివిల్, విద్యుత్తు విభాగం సాంకేతిక నిపుణులను ఆదేశించారు. వచ్చే నెల ఆరో తేదీన సాయంత్రం బాలాలయం పూజలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. పాత కడప బండలను తొలగించి చలువరాయి పరుస్తామని పురావస్తుశాఖ జిల్లా అధికారి పి.బాలకృష్ణారెడ్డి తెలిపారు.
38
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
95
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
30
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
31
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
29
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
39
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
43
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....