42
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద గల పాతాళేశ్వర ఆలయం వెనుక పక్క ఖాళీ స్థలంలో మూగజీవాల అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండగా.. స్థానిక పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ఇక్కడి నుంచి పశువులను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పశువులకు సరైన ఆహారం, నీరు పెట్టకుండా వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్లోని గో మాంసం విక్రయించే చోటకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ పోలీసులు దాడిచేసిన సమయంలో 104 పశువులను రవాణా చేయడానికి సిద్ధం చేయగా, నిందితులను అదుపులోకి తీసుకొని, పశువులను స్వాధీనం చేసుకొన్నారు. దీనిపై స్థానిక ఎస్ఐ జి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు