News

రాష్ట్రంలోని దేవాలయాల్లో కొత్త పాలకవర్గాలు

52views

రాష్ట్రంలోని దేవాలయాల్లో అధికారులను మార్చడంతో పాటు కొత్త పాలకవర్గాలను నియమిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం రాత్రి రావులపాలెంలో మాట్లాడారు. రిజిస్ట్రేషన్‌ అయిన 5,400 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ.5వేలు ఇస్తున్నామని, రూ.10వేలు ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు.50వేల లోపు ఆదాయం ఉన్న దేవాయాల్లో అర్చకులకు ఇకపై రూ.15వేలు ఇస్తామన్నారు. ఆలయాల్లో ఉన్న కమిటీలు గౌరవంగా తప్పుకోవాలన్నారు. తిరుమలలోని పరకామణిలో ఒక వ్యక్తి 9 డాలర్లను దొంగిలిస్తుంటే పట్టుకుని కేసు నమోదు చేశారని, ఆ వ్యక్తి తప్పుడు విధానంలో రూ.కోట్లు సంపాదించాడని తెలిసిందన్నారు.

వాడపల్లి ఆలయంలోనూ మార్పులు:
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా మార్పులు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి శనివారం 80వేల మంది వస్తున్నారని, అన్నదానం వద్ద ఇబ్బందులు ఉన్నాయని, వసతులు మెరుగుపరచాలని ఓ భక్తుడు తెలిపారన్నారు.