తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం, తిరుమూరు గ్రామంలో చెట్ల పొదల్లో శిథిలావస్థలో బయటపడిన విష్ణు ఆలయాన్ని మంగళవారం పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తుశాఖ ఏడీ శివకుమార్, చరిత్ర కారుడు స్థపతి, ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్స్ గోవిందుసురేంద్ర, వినోద్, దేవదాయశాఖ అధికారి శశాంక్ తదితరులు ఆలయాన్ని సందర్శించి, ఆలయ చరిత్రను అంచనా వేశారు. గోవిందుసురేంద్ర మాట్లాడుతూ స్థానికుల ఆహ్వానంతోపాటు మైసూర్ పురావస్తుశాఖ అధికారి మునిరత్నంరెడ్డి ఆదేశాలతో ఆలయాన్ని సందర్శించినట్టు తెలిపారు. ఈ ఆలయాన్ని చూస్తే చోళుల నాటి కట్టడాలుగా, మంచి చరిత్ర ఉన్న ఆలయంగా తెలుస్తోందన్నారు. ఒకప్పుడు తిరుమూరు వర్తక వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు చరిత్రద్వారా తెలుస్తోందని, అలాగే తీర ప్రాంతంలో చాలా ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసి గత వైభవాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని సూచించారు.
49
You Might Also Like
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...
అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం
2
అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన...
కల్తీ నెయ్యి వివాదంపై తిరుపతిలో స్వామిజీలు ఆందోళన
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై పలువురు స్వామీజీలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన కొనసాగింది....
అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
16
పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
60
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....