News

బాల్యం నుంచే భక్తి భావాలు పెరగాలి

47views

తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి భక్తిభావాలుపెంచాలని, ప్రతి ఒక్కరూ నుదురుపై కుంకుమబొట్టు పెట్టుకోవాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నారు.అనకాపల్లి స్థానిక మొయిన్‌రోడ్డు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా శతజయంతి మహాత్సవాల్లో భాగంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ‘శ్రీ మాత్రే నమః’ అనే అంశంపై ప్రవచనాలు చేశారు. జీవితం అంతా స్థిరం కాదని, చెట్టు మీద నుంచి పడిన దెబ్బ తట్టుకోలేని వ్యక్తి జీవితంలో దెబ్బలకి ఎలా తట్టుకుంటాడని ఆయన వివరించారు. అనకాపల్లి అంటేనే బెల్లానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని, బెల్లంలో తియ్యదనాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని ఆయన కోరారు. విద్యార్థులకు చదువుల భారం ఎక్కువగా ఉండడంతో మత్తు పదార్థాలకు దగ్గరవుతున్నారని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు గరికిపాటి నరసింహరావును శాలువాతో సత్కరించారు.