49
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో శనివారం ఎల్విన్పేట సీఐ సత్యనారాయణ, ఎస్ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ప్రధాన రహదారిలోని కల్వర్టులు, వంతెనల వద్ద బాంబు డిటెక్టర్లతో పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.