ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు మరింత సౌకర్యంగా, స్నేహపూర్వకంగా అందేలా చూస్తామని నూతన అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి తెలిపారు. శనివారం అదనపు ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, జేఈఓ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందించారు. అనంతరం వెంకయ్యచౌదరి మాట్లాడుతూ ఈ బాధ్యతలు శ్రీవారి ఆశీస్సులతో దక్కాయని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ‘భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయసేకరణ కీలకం. దేవస్థానంలోని అన్ని విభాగాల సమన్వయంతో వారికి అంకితభావంతో మెరుగైన సేవలందించడంపై దృష్టి పెడతాం. ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తామ’ని చెప్పారు. అనంతరం గోకులం అతిథిగృహంలో టీటీడీ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
78
You Might Also Like
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
15
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
12
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
27
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
32
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5000 మందితో బందోబస్తు
18
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద...
శతకోటి సూర్యులను తలదన్నే… ప్లాస్మా ప్రవాహాలు
29
ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్హోల్ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్హోల్ జెట్) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో...