87
పవిత్ర అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా సహకారంతో ఐఎస్ఐ ఈ కుట్రకు తెరతీసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
తీర్థయాత్ర సమయంలో సామాన్య పౌరులే టార్గెట్గా ఉగ్రదాడికి ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. పంజాబ్, దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ నాయకులు, హిందువులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిచేందుకు ఐఎస్ఐ ప్రణాళిక రచించినట్లు సదరు వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ గ్యాంగ్స్టర్లు, రాడికల్ గ్రూపులు ఈ దాడి కోసం ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపినట్లు అధికారులు చెబుతున్నారు.